Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేక్ ఫాస్ట్ తీసుకోని పిల్లల్లో మధుమేహం తప్పదట!

Webdunia
సోమవారం, 27 అక్టోబరు 2014 (17:46 IST)
బ్రేక్ ఫాస్ట్ తీసుకోని పిల్లల్లో మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా పరిశోధనలో తేలింది. ఇంగ్లండ్‌లోని పాఠశాలల్లో 10 ఏళ్లలోపు పిల్లలపై జరిపిన ఈ పరిశోధనలో బ్రేక్ ఫాస్ట్ తీసుకోని పిల్లల్లో డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలామటుకు ఉన్నాయని తేలింది. 
 
ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం ద్వారా డయాబెటిస్2 వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలియవచ్చింది. ఈ ప్రమాదం నుంచి పిల్లల్ని కాపాడుకోవాలంటే.. ఉదయం పూట అల్పాహారం తప్పకుండా తీసుకోవాల్సిందిగా నచ్చజెప్పాలి. ఉదయం పూట పీచు పదార్థాలు అధికంగా గల సహజసిద్ధమైన పండ్లు, కూరగాయలతో చేసిన వంటకాలను తీసుకునేలా చేయాలి. తద్వారా డయాబెటిస్‌తో పాటు ఒబిసిటీని కూడా దూరం చేసుకోవచ్చు.
 
తల్లిదండ్రులు ఏం చేయాలంటే..?
అల్పాహారం తీసుకోకుండా మారాం చేసే పిల్లల పట్ల శ్రద్ధ పెట్టాలి. ఆహారంలో మార్పులు చేయాలి. డైట్ ప్లాన్ మార్చాలి. పిల్లలకు నచ్చే ఆహారం ఇస్తూనే... అందులో పోషక విలువలు ఉండేలా చేసుకోవాలి. లేకుంటే కంటి సమస్యలు, కిడ్నీ వ్యాధులు, గుండె సంబంధిత రోగాలతో ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

Show comments