పిల్లలకు పౌష్టికాహారం ఓకే.. వ్యాయామం చేయిస్తున్నారా?

Webdunia
మంగళవారం, 13 జనవరి 2015 (16:46 IST)
పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్లకు పోషకాహారాన్ని అందివ్వడమే కాదు.. వ్యాయామం చేసేలా కూడా ప్రోత్సహించాలి. అయితే దానికీ కొన్ని కిటుకులున్నాయి. భోజనం అయ్యాక మంచమెక్కేయడం.. టీవీ ముందు కూర్చోకుండా పిల్లలతో కలిసి కాసేపు బయట నడవండి. 
 
సాధ్యమైనంత వరకూ ఆ సమయంలో చదువూ, లక్ష్యాల గురించి మాట్లడటం మొదలు పెడితే వారికి ఆసక్తి తగ్గిపోవచ్చు. అందుకే కాసేపు సరదాగా నడవాలి. 
 
పరుగెత్తినా, వేగంగా నడిచినా, కండరాలను బలోపేతం చేసే పుషప్స్, ఎముకల్ని దృఢంగా ఉంచే తాడాట ఆడటం వంటివన్నీ కలిపి మొత్తం గంట వ్యాయామం చేసేలా చూడాలి. అయితే ఇది ఒకేసారి కాకుండా రోజులో కుదిరినప్పుడల్లా చేసేలా ప్రోత్సహించాలి. 
 
శారీరక శ్రమ అనేది పోటీ తరహాలో ఉండకూడదు. అలాగే ప్రత్యేకమైన పరికరాలూ ఉండాలని లేదు. తాడూ, బంతి, సైకిల్ వంటివి అందుబాటులో ఉంచితే చాలు. వాటి చేతే వ్యాయామం చేయించవచ్చు. 
 
వ్యాయామాన్ని ఇంట్లో చేయమంటే పిల్లలు బద్దకించవచ్చు. అందుకే దగ్గర్లోని పార్కుకి తీసుకెళ్లండి. వ్యాయామంలో ఆటలు కూడా మేళవిస్తేనే పిల్లలు ఉత్సాహంగా చేస్తారు. కాబట్టి సరదాగా, ఆడుతూపాడుతూనే వారిచేత వ్యాయామం చేయించాలి.
 
పిల్లలకి క్రీడలపై ఆసక్తి ఉంటే ఆ దిశగానూ ప్రోత్సహించాలి. వ్యాయామంతో పాటు వాళ్లకొక విద్య కూడా వచ్చినట్లవుతుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నకిలీ స్టాక్ ట్రేడింగ్ - రూ.85 లక్షల వరకు మోసపోయిన హైదరాబాదీ

తెలంగాణ టూరిజంకు రూ.146.50 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం

హనీమూన్ మర్డర్ కేసు తరహాలో పెళ్లైన మూడు నెలలకే భర్తను చంపేసిన కిలేడి

SIR begins in Telangana: తెలంగాణలో ఎస్ఐఆర్ కోసం సన్నాహక పనులు ప్రారంభం

MBBS Student: హాస్టల్ గదిలో మృతి చెందిన ఎంబీబీస్ స్టూడెంట్.. ఏమైంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఖాతాలో అరుదైన రికార్డ్: జపాన్ అనాన్‌పై సోలోగా రెబల్ స్టార్

మన శంకర వర ప్రసాద్ గారు జీ5లో స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది

సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదె నిర్మిస్తోన్న రాకాస డేట్ ఫిక్స్

మీర్జాపురం రాణి కృష్ణవేణి అరుదైన భగీరథ ప్రయత్నం

375 కోట్లకు పైగా వసూలు చేసిన మెగాస్టార్ చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు

Show comments