Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటా 20 లక్షలమంది చిన్నారుల మృతి

Webdunia
భారత దేశంలో ప్రతి సంవత్సరం 20 లక్షల మంది చిన్నారులు మృత్యు ఒడిలోకి చేరుతున్నట్లు అంతర్జాతీయ దాతృత్వ సంస్థ "సేవ్ ది చిల్డ్రన్" వెల్లడించింది. వీరిలో 60 శాతం మంది పిల్లలు కేవలం పుట్టిన 28 రోజులకే మరణిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.

మంగళవారం రోజున ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఒక ప్రకటనను విడుదల చేసిన సేవ్ ది చిల్డ్రన్ సంస్థ... కలరా, మలేరియా, నిమోనియా లాంటి వ్యాధులు పసివారి మరణాలకు కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రపంచంలోని ప్రతి నలుగురు చిన్నారుల్లో ఒకరు ఏడాది వయసు లోపలే మృత్యు ఒడికి చేరుకుంటున్నారనీ... అలాగే భారతదేశంలో ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరు పోషకాహార లోపంతో మరణిస్తున్నారనీ సేవ్ ది చిల్డ్రన్ సంస్థ తన ప్రకటనలో వివరించింది.

కాబట్టి.. ఆయా దేశాల ప్రభుత్వాలు చిన్నారుల మరణాలను ఆపాలంటే... వారి మరణాలకు కారణాలుగా ఉంటున్న వ్యాధుల నివారణకు తగిన కృషి చేయాలని సేవ్ ది చిల్డ్రన్ సూచించింది. అంతేగాకుండా.. భారత్‌లో ప్రధానంగా పోషకాహార లోపంతో మృత్యు ఒడికి చేరుకుంటున్న చిన్నారులను కూడా కాపాడాలని ఆ సంస్థ విజ్ఞప్తి చేసింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Show comments