గుంటూరు జిల్లా ఓదార్పులో జగన్‌పై కోడిగుడ్లు, గులకరాళ్లు

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2012 (18:40 IST)
WD
గుంటూరు జిల్లా నర్సరావు పేట మండలం నకిరేకల్‌లో జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రలో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. జగన్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లు, గులకరాళ్లు విసిరారు. జగన్ వాటి నుంచి తృటిలో తప్పించుకున్నారు.

కోడిగుడ్లు విసిరిన దుండగులను ఆ తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సందర్భంలో పెద్ద ఎత్తున తోపులాట జరగడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

వారం రోజుల తర్వాత గుంటూరు జిల్లాలో జగన్ తిరిగి తన ఓదార్పు యాత్రను ప్రారంభించారు. యాత్ర నకిరేకల్‌లో చేయనుండటంతో పట్టణంలో కొంతమంది జగన్ ఫ్లెక్సీలను కట్టారు. ఈ విషయంలో కాపు సామాజిక వర్గంతో మరొక వర్గం గొడవ పడింది.

ఆ మరుసటి రోజు కుంకులగుంటలో ఉన్న వంగవీటి మోహన రంగా విగ్రహంపైకి చెప్పు విసిరిన సంఘటన చోటుచేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగిందనుకున్నప్పటికీ జగన్ యాత్రలో మరోసారి రాళ్ల దాడితో బయటపడింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

Show comments