Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సత్యం'లో ఉద్యోగుల కోతకు రంగం సిద్ధం

Webdunia
సత్యం కప్యూటర్ సంస్థ తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. దాదాపు 4.5 వేల మంది ఉద్యోగులను తప్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. సత్యంలో సుమారు 51 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులోంచి 9 శాతం మందిని బయటకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే 15 వందల మందిని పీఐపీ కింద పెట్టినట్లు ఉద్యోగ వర్గాల ద్వారా తెలుస్తోంది. పనిని మెరుగు పరుచుకోవాలనే నెపంతో బయటకు పంపేందుకు వారిని జాబితాలో ఉంచినట్లేనని తెలుస్తోంది. వీరు కాకుండా ఇంచుమించు 3 వేల మంది ఉద్యోగులకు గత అప్‌రైజల్‌లో ఇంక్రిమెంట్ ఇవ్వకుండా నిలిపివేశారు. ఇది కూడా వారి తరువాత దశలో బయటకు పంపివేసే మార్గమేననే ఆరోపణలున్నాయి.

ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో సత్యం కంప్యూటర్స్‌లో పనిచేసే ఉద్యోగులందరికీ అధినేత నుంచి ఒక హెచ్చరిక సందేశం రూపంలో వచ్చింది. డ్రస్ కోడ్‌లో ఎక్కడ తేడా వచ్చినా క్రమశిక్షణా చర్యలు తప్పవని దాని సారాంశం. దీంతో ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టుకుంది. ఇంక్రిమెంట్లు పొందని దాదాపు వేల మంది ఉద్యోగుల్లో చాలా మంది తమ కొలువులను వదిలి వెళ్ళి పోవడానికి సిద్ధమవుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

Show comments