Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగుల వేతనాలపై ఐటి దిగ్గజాల వేటు

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2008 (19:49 IST)
రాన్రానూ తమ క్లయింట్లు ఐటిపై వెచ్చిస్తున్న వ్యయాలు తగ్గిపోతుండటంతో ప్రముఖ బారతీయ ఐటి దిగ్గజాలు తమ ఖర్చులలో అత్యధిక భాగంగా ఉంటున్న ఉద్యోగుల వేతనాలపై వేటు వేయడానికి సిద్ధపడుతున్నాయి. దీంతో ఐటి కంపెనీల కార్మికశక్తిలో 0.5 నుంచి 10 శాతం మేరకు ఉన్న దిగువ స్థాయి ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం వచ్చి పడింది.

అగ్రశ్రేణి ఐటి కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, సత్యం, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ మరియు కాగ్నిజెంట్ సంస్థల్లో 4.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. రిజర్వ్ బెంచ్‌లలో ఉన్నవారు, శిక్షణ పొందుతున్న వారు మినహాయిస్తే, వీరిలో 60 శాతం మంది ఉద్యోగులు శాశ్వత ఉద్యోగులుగా ఉన్నారు. వీరిలో 1.5 శాతం మంది శాశ్వత ఉద్యోగులను తొలగించాలని కంపెనీలు భావించినట్లయితే, ఐటి దిగ్గజ సంస్థలనుంచి 4 నుంచి 5 వేలమంది వరకు ఉద్యోగులు ఇంటి దారి పట్టవలసి ఉంటుంది.

ఐటి కంపెనీల ఆదాయ పరిస్థితి బాగున్నప్పుడు కంపెనీ సీఈఓలు దిగువ స్థాయిలోని 1-5 శాతం మంది ఉద్యోగులను లక్ష్యంగా చేసుకునేవారు కారని, 2006-07 సంవత్సరాలలో ఇలాంటి ఆలోచనలు కూడా వారికి ఉండేవి కావని మా ఫోయ్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్ సిఇఒ బాలాజి అభిప్రాయ వ్యక్తం చేశారు.

పోటీలో సంస్థ ఉనికిని నిలబెట్టుకోవాలంటే ఉత్పాదకతా స్కేల్‌లో ఉద్యోగుల సంఖ్య కీలకపాత్ర వహిస్తుందని యాడ్ అస్త్రా కన్సల్టెంట్ ఎండీ నిరుపమా చెప్పారు. గత సంవత్సరంలో పనితీరు సరిగా లేని వారు సైతం 4-5 శాతం మేరకు జీతాల్లో మెరుగుదలను సాధించగా ఈసారి మాత్రం అలాంటి వారిని రాజీనామా చేయమని కోరుతున్నారని లేదా వారి జీతాల పెంపును కంపెనీలు పట్టించుకోవడం లేదని ఆమె చెప్పారు.

కాగా, మరొక దిగ్గజం ఇన్ఫోసిస్ మానవవనరుల విభాగం డైరెక్టర్ మోహన్‌దాస్ పాయ్ మాట్లాడుతూ 60 వేలమంది సంస్థ ఉద్యోగులలో 2 నుంచి 2.5 శాతం మంది పనితీరు బాగాలేదని రుజువవుతోందని వీరిలో 50 నుంచి 70 శాతం మంది ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటిదారి పట్టక తప్పదని ఆరకంగా పనితీరు మెరుగుదల పథకం అమలవుతుందని తేల్చి చెప్పారు.

మొత్తంమీద చూస్తే ఐటి ఉద్యోగుల హవా తగ్గుముఖం పడుతోందనడంలో సందేహమే లేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

Show comments