Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లోకి షియోమీ నోట్-4.. హైబ్రిడ్ డ్యూయెల్ సిమ్ ఫీచర్‌తో ధరెంతో తెలుసా?

భారత మార్కెట్లోకి చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ మరో స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 19వ తేదీన రెడ్‌మీ సిరీస్‌లో నోట్-4 స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (16:45 IST)
భారత మార్కెట్లోకి చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ మరో స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 19వ తేదీన రెడ్‌మీ సిరీస్‌లో నోట్-4 స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి షియోమీ విడుదల చేయనుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయినా ఢిల్లీలో 19న షియోమీ ఓ కార్యక్రమాన్ని నిర్వహించనుందని తెలిసింది. 
 
ఇక షియోమీ నోట్4లో 2జీబీ ర్యామ్, 16 జీబీ అంతర్గ మెమొరీ ఉంది. ఇంకా 5.5 అంగుళాల హెచ్‌డీ డిస్ప్లే(1920X1080 పిక్సెల్స్), 4,100 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాను ఈ ఫోన్ కలిగివుంటుందని షియోమీ వెల్లడించింది. 
 
ఇందులో 13 ఎంపీ బ్యాక్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్స్ వున్నాయని షియోమీ తెలిపింది. ప్రత్యేకంగా ఈ స్మార్ట్ ఫోన్ హైబ్రిడ్ డ్యూయల్ సిమ్‌ను ఫీచర్‌ను కలిగివుంటుంది. దీని ధర రూ.10వేల నుంచి రూ.13వేల లోపు ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments