రెడ్ మీ ఫోన్ పేలిపోయింది.. ఎక్కడ?

మొబైల్ మార్కెట్‌లో పెను సంచలనంగా మారిన రెడ్ మీ ఫోన్ పేలిపోయింది. అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని శివాజినగర్‌లో సోమవారం ఈ ఘటన జరిగింది.

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2017 (14:10 IST)
మొబైల్ మార్కెట్‌లో పెను సంచలనంగా మారిన రెడ్ మీ ఫోన్ పేలిపోయింది. అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని శివాజినగర్‌లో సోమవారం ఈ ఘటన జరిగింది. కాలనీకి చెందిన మణి తన రెడ్‌ మీ నోట్‌ ఫోర్‌ ఫోన్‌ జేబులో వేడి అవుతోందని పక్కన పెడుతుండగా ఫోన్‌ నుంచి పొగలు వచ్చాయి. 
 
దీంతో అప్రమత్తమైన యువకుడు దూరంగా వెళ్లిపోగానే ఫోన్‌ పేలిపోయింది. ఈ ఫోన్‌ను ఇటీవలే కొనుగోలు చేశాడు. ఇటీవల కాలంలో పలుచోట్ల ఫోన్‌లు పేలాయనే విషయాన్ని వాట్సప్‌లో, పత్రికల్లో చూసిన వినియోగదారులు ఇప్పుడు ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. 
 
చైనాకు చెందిన షియోమీ సంస్థ తాజాగా రెడ్ మీ 4, రెడ్ మీ 5ఏ ఫోన్లను విడుదల చేయగా, ఇవి హాట్ కేకుల్లా అమ్ముడు పోయిన విషయం తెల్సిందే. వీటిలో ఒకటైన రెడ్ మీ 4 నోట్ పేలిపోయింది. దీంతో ఈ ఫోన్ భద్రతా ప్రమాణాలపై పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments