Webdunia - Bharat's app for daily news and videos

Install App

40 అంగుళాల టీవీ కేవలం రూ.17 వేలు మాత్రమే...

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (18:41 IST)
భారతీయ టీవీ మార్కెట్‌లో అడుగుపెట్టి సంచలనం సృష్టిస్తున్న చైనాకు చెందిన షియోమీ... తాజాగా మరో సంచలనానికి తెరతీసింది. 40 అంగుళాల టీవీని కేవలం రూ.17,999కే అందివ్వనుంది. ఈ మోడల్‌తోపాటు మరో మూడు మోడళ్ళను కూడా భారతీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. 
 
ఐటీ సిటీ బెంగుళూరులో జరిగిన స్మార్ట్ లైవింగ్ కార్యక్రమంలో షియోమీ ఎంఐ టీవీ 4x65 అంగుళాలు, ఎంఐ 4x43 అంగుళాలు, ఎంఐ టీవీ 4x50 అంగుళాలు, ఎంఐ టీవీ 4ఎ అంగుళాల టీవీలు ఉన్నాయి. వీటిలో 4x65 అంగుళాల టీవీనే అతిపెద్దతి. అలాగే, 34.2 శాతం ఎంఐ టీవీ మోడళ్లను భారత్‌లో ఆఫ్‌లైన్ ద్వారా విక్రయించినట్టు షియోమీ వెల్లడించింది. 
 
కాగా, ఎంఐ టీవీ 4x65 అంగుళాల టీవీ ప్రారంభ ఆఫర్‌లో భాగంగా రూ.54,999కే అందుబాటులోకి తెచ్చింది. ఎంఐ టీవీ 4x43 అంగుళాల టీవీ ధర రూ.24,999 కాగా, 40 అంగుళాల టీవీ ధర రూ.17,999 మాత్రమే. 50 అంగుళాల టీవీని రూ.29,999కే అందుబాటులో ఉంచింది. 
 
అమెజాన్, ఎంఐ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. అన్ని టీవీలు ఈ నెల 29న అర్థరాత్రి నుంచి విక్రయానికి సిద్ధంగా ఉంచనుంది. అయితే, 65 అంగుళాల టీవీని మాత్రం 29 నుంచి ప్రీ ఆర్డర్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments