Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగులను ఇంటికి సాగనంపేందుకు సిద్ధమవుతున్న విప్రో

వరుణ్
బుధవారం, 31 జనవరి 2024 (17:34 IST)
భారత ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన విప్రో త్వరలో లేఆఫ్స్‌కు సిద్ధమవుతుంది. లాభాలు పెంచుకునే చర్యల్లోభాగంగా, పలువురు ఉద్యోగులను ఇంటికి పంపించాలని భావిస్తుంది. వీరిలో మిడ్ లెవల్ ఉద్యోగులు వందల సంఖ్యలో ఉన్నారు. దేశంలోని నాలుగు ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైన విప్రో కంపెనీ లాభాలు... పోటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్ కంటే తక్కువగా ఉన్నట్టు తెలిసింది. అయితే, ఈ తొలగింపుల పర్వాన్ని కంపెనీ ఇప్పటికే ప్రారంభించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 
 
ఈ నెల ఆరంభంలో ఉద్యోగులకు ఈ మేరుక సంచారం అందించనుంది. ఆన్‌సైట్‌ల ఉన్న వందల మంది మిడ్ లెవెల్ మేనేజ్‌మెంట్ ఉద్యోగులను సాగనంపనున్నారు. వీళ్ళలో చాలా మంది భారీ వేతనాలు తీసుకుంటున్నవారు ఉండటం గమనార్హం. కాగా, కంపెనీకి లాభాలు తెచ్చిపెట్టే బాధ్యతను సీఎఫ్ఓ అపర్నా అయ్యర్‌కు కంపెనీ అప్పగించింది. ఈ లేఆఫ్స్‌‍లో భాగంగా, సంస్థ లెఫ్ట్ షిఫ్ట్ పద్ధతిని అనుసరిచనున్నట్టు తెలిసింది. లెవల్-3 ఉద్యోగి బాధ్యతలు లెవల్-2 ఉద్యోగికి వెళతాయి. లెవల్-2 బాధ్యతలు లెవల్-1కు మారుతాయి. ఇక లెవల్-1 బాధ్యతలను ఆటోమేట్ చేయాలి. ఈ తరహా విధానాన్ని అన్ని కంపెనీలు చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments