అలాంటి మెసేజ్‌ను టచ్ చేస్తే మీ ఫోన్ అంతేసంగతులు..

అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేకొద్దీ కొత్తకొత్త సమస్యలు కూడా పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో ఇప్పుడు యూజర్లకు కొత్త సమస్య ఎదురవుతోంది.

Webdunia
సోమవారం, 7 మే 2018 (14:25 IST)
అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేకొద్దీ కొత్తకొత్త సమస్యలు కూడా పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో ఇప్పుడు యూజర్లకు కొత్త సమస్య ఎదురవుతోంది. అందులో బంతి ఆకారంలో వచ్చే ఏ ఎమోజీ ఉన్న మెసేజ్‌ను టచ్ చేసినా యూజర్ల వాట్సాప్ యాప్ హ్యాంగ్ అవుతున్నట్టు గుర్తించారు. మరికొంతమంది యూజవర్లకు ఏకంగా ఫోన్లే పనిచేయకుండా పోతున్నాయి.
 
అయితే నిజానికి ఇది వాట్సాప్‌లో వచ్చిన సమస్య కాదు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉన్న బగ్ (సాఫ్ట్‌వేర్ లోపం) వల్లే సదరు బంతి లాంటి ఎమోజీలను టచ్ చేసినప్పుడు యాప్స్, ఫోన్లు హ్యాంగ్ అవుతున్నట్లు సాఫ్ట్‌వేర్ నిపుణులు గుర్తించారు. సదరు ఎమోజీలను వాట్సాప్‌లో కాకుండా ఏ ఇతర మెసేజింగ్ యాప్‌లో వాడినా పరిస్థితి ఇలాగే ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 
 
దీంతో అలాంటి ఎమోజీలు ఉన్న మెసేజ్‌లను ఓపెన్ చేయడం, ఆ ఎమోజీలను టచ్ చేయడం చేయవద్దని సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా గూగుల్ టెక్ నిపుణులు నిమగ్నమైవున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: #AA22xA6 గురించి సన్ పిక్చర్స్ ప్రకటన

Dacoit: అమీర్ ఖాన్ మేనకోడలు... కెమెరామేన్ కళ్లకు కనిపించిన ఎద అందాలు.. వీడియో వైరల్

Suriya: గురు శిష్యుల సంబంధంగా సూర్య చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్

ఊరి మట్టినే ఆయుధంగా మలచి పోరాడిన వ్యక్తి కథగా పళ్లిచట్టంబి

సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పనున్న హీరోయిన్ త్రిష?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

హెచ్చరిక: అందరి దృష్టిని ఆకర్షించేలా తన లేటెస్ట్ కలెక్షన్‌ను రూపొందించిన మోచీ

UP Woman Scripts History: ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ వరకు సైకిల్ యాత్ర.. దివ్య సింగ్ రికార్డ్ (video)

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

తర్వాతి కథనం
Show comments