Webdunia - Bharat's app for daily news and videos

Install App

వోడాఫోన్ బంపర్ ఆఫర్... రూ.399 రీచార్జ్‌తో ఆర్నెల్లు ఉచితం

ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన వోడాఫోన్ తాజాగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.399కే ఆరు నెలల పాటు వినియోగించుకునేలా 90 జీబీ 4జీ డేటా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దీంతోపాటు అపరిమిత లోకల్/ఎస్టీడీ కాల్స్

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2017 (07:29 IST)
ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన వోడాఫోన్ తాజాగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.399కే ఆరు నెలల పాటు వినియోగించుకునేలా 90 జీబీ 4జీ డేటా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దీంతోపాటు అపరిమిత లోకల్/ఎస్టీడీ కాల్స్ కూడా చేసుకోవచ్చని తెలిపింది.
 
ఇటీవల టెలికాం సంచలనం రిలయన్స్ జియో తన టారిఫ్ ఆఫర్లను సవరించిన విషయం తెల్సిందే. అయితే, వొడాఫోన్ మాత్రం ఏకంగా వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 
 
రూ.399తో రీచార్జ్ చేసుకునే వినియోగదారులు తమ 90జీబీ 4జీ డేటాను అవసరమైతే ఒక్క రోజులోనే వినియోగించుకునే వెసులుబాటు కూడా ఉందని, లేదంటే ఆరు నెలలపాటు వినియోగించుకోవచ్చని వివరించింది. అంటే ఈ ఆఫర్‌లో ఒక జీబీ రూ.4.43కే వినియోగదారులకు లభిస్తుందని పేర్కొంది.
 
కాగా, రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌లు కూడా రూ.399 రీచార్జ్ ప్లాన్‌లు అందిస్తున్నా వాటి కాలపరిమితి, డేటా బాగా తక్కువగా ఉంది. జియో రోజుకు 1జీబీ చొప్పున 70 రోజుల కాలవ్యవధితో 84 జీబీ అందిస్తుండగా, ఎయిర్‌టెల్ రోజుకు ఒక జీబీ చొప్పున 70 రోజులపాటు 70జీబీ డేటాను అందిస్తోంది. వోడాఫోన్ మాత్రం వీటికి ధీటుగా 90జీబీతో పాటు.. 180 రోజులు ఇవ్వనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments