Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూసీ బ్రౌజర్‌పై కన్నేసిన కేంద్రం.. వ్యక్తిగత వివరాలు చైనా సర్వర్‌కు వెళ్ళిపోతున్నాయట..

చైనా ఈ-కామర్స్‌ దిగ్గజం అలీబాబాకు చెందిన యూసీ బ్రౌజర్‌పై కేంద్రం కన్నేసింది. ప్రస్తుతం భారత్‌లోని 50 శాతం మొబైల్‌ యూజర్లు ఈ బ్రౌజర్‌ను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన యూసీ బ్రౌజర్ వినియో

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (10:35 IST)
చైనా ఈ-కామర్స్‌ దిగ్గజం అలీబాబాకు చెందిన యూసీ బ్రౌజర్‌పై కేంద్రం కన్నేసింది. ప్రస్తుతం భారత్‌లోని 50 శాతం మొబైల్‌ యూజర్లు ఈ బ్రౌజర్‌ను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన యూసీ బ్రౌజర్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారంతో పాటు ఐఎంఎస్‌ఐ, ఐఎంఈఐ నంబర్లను, లొకేషన్‌ వివరాలను చైనాలోని సర్వర్‌కు పంపుతోందని సమాచారం. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ ల్యాబ్ ఇప్పటికే విచారణ జరుపుతున్నట్లు ఓ ఆంగ్లపత్రిక వెల్లడించింది.
 
యూసీ బ్రౌజర్ వైఫైకి అనుసంధానం అయినప్పుడు వినియోగదారుడి ఫోన్‌ వివరాలతో పాటు, యాక్సెస్‌ చేసే నెట్‌వర్క్‌ సమాచారం చైనాలోని ఓ సర్వర్‌కు పంపుతున్నట్లు ఆంగ్ల పత్రిక తెలిపింది. ఈ ల్యాబ్ విచారణలో యూసీది తప్పని తేలితే కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని ఆ ఆంగ్ల మీడియా పేర్కొంది. ఇప్పటికే రెండు విడతలుగా 30 మొబైల్ తయారీ కంపెనీలకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. తాజాగా రిలయన్స్‌ జియోకు చెందిన లైఫ్‌ బ్రాండ్‌ ఫోన్లతో పాటు, వీడియోకాన్‌, మైజు కంపెనీలకు నోటీసులు జారీ చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments