టిక్ టాక్, వీ చాట్‌లపై బ్యాన్.. సంతకం చేసిన ట్రంప్.. 45రోజుల్లోగా అమలు

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (10:43 IST)
చైనాపై ప్రపంచ దేశాలు గుర్రుగా వున్నాయి. ఇందులో భాగంగా చైనా యాప్స్‌పై బ్యాన్ కొనసాగుతోంది. అమెరికాను ఆర్ధికంగా దెబ్బతీయడానికి చైనా చూస్తోందని.. టిక్ టాక్, వీ చాట్ వంటి యాప్స్ ద్వారా అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని ఆయా కంపెనీలు చైనా కమ్యునిస్ట్ ప్రభుత్వానికి అందజేస్తున్నాయని ట్రంప్ గతంలోనే పలు విమర్శలు గుప్పించారు. ఇక భారత్‌లో కూడా చైనాకు సంబంధించిన 59 యాప్స్ బ్యాన్ అయిన సంగతి తెలిసిందే.  
 
తాజాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్‌పై బ్యాన్ విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఈ బ్యాన్ 45 రోజుల్లోగా అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. అంతకముందు ట్రంప్ టిక్‌టాక్‌ను చైనాకు చెందిన బైట్‌డాన్స్ కంపెనీ.. అమెరికా సంస్థకు విక్రయించాలని.. లేదంటే బ్యాన్ తప్పదని హెచ్చరించిన సంగతి తెలిసిందే.
 
ఈ నేపథ్యంలోనే సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేయాలని చూస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. సెప్టెంబర్ 15కు ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్‌తో 45 రోజుల్లోగా లావాదేవీలన్నింటిపైనా నిషేధం విధించనున్నట్లు ట్రంప్ పేర్కొంటూ తాజాగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments