Webdunia - Bharat's app for daily news and videos

Install App

Thanks to Jio : ఫోన్‌ బిల్లులు తగ్గాయంటున్న వినియోగదారులు!

రిలయన్స్ జియోకు ఫోన్ వినియోగదారులు ధన్యవాదాలు చెపుతున్నారు. జియో సేవలు అందుబాటులోకి రాకముందు ఫోను బిల్లులు తడిసి మోపెడయ్యేవి. కానీ, జియో సేవలు అందుబాటులోకి వచ్చాక ఫోన్ బిల్లులు గణనీయంగా తగ్గిపోయాయి.

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (09:21 IST)
రిలయన్స్ జియోకు ఫోన్ వినియోగదారులు ధన్యవాదాలు చెపుతున్నారు. జియో సేవలు అందుబాటులోకి రాకముందు ఫోను బిల్లులు తడిసి మోపెడయ్యేవి. కానీ, జియో సేవలు అందుబాటులోకి వచ్చాక ఫోన్ బిల్లులు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో జియోకు శతకోటి వందనాలు అంటూ కోట్లాది మంది ఫోన్ వినియోగదారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 
నిజానికి జియో రాకముందు... వివిధ రకాల టారిఫ్‌లతో అన్ని టెలికాం కంపెనీలు మోత మోగిస్తూ వచ్చాయి. కానీ జియో వచ్చాక టెల్కోలన్నీ కిందకి దిగొచ్చాయి. దీంతో గత ఏడాదిగా వినియోగదారుల మొబైల్‌ బిల్లులు భారీగానే తగ్గాయి. అంతేకాక టెలికాం ఇండస్ట్రీలో ప్రస్తుతం నెలకొన్న ధరల యుద్ధంతో మరింత స్థాయిలో ధరలు కిందకి పడిపోనున్నాయని ఇండస్ట్రి నిపుణులు చెబుతున్నారు.
 
వచ్చే ఏడాది సగటున 25-30 శాతం టారిఫ్‌లు కిందకి పడిపోవచ్చని విశ్లేషకులు, ఇండస్ట్రి ఇన్‌సైడర్స్‌ అంచనావేస్తున్నారు. ఒకవేళ మీరు ఎక్కువ డేటా వాడే వారైతే, మరింత లబ్ది పొందవచ్చంటూ పేర్కొంటున్నారు. రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ మార్కెట్‌లోకి ప్రవేశించిన అనంతరం గతేడాదిగా టారిఫ్‌ ధరలు కనీసం 25-32 శాతం కిందకి పడిపోయాయి. ఎక్కువ డేటా వాడేవారికి ధరల నుంచి 60-70 శాతం ఉపశమనం లభించిందని తెలిసింది. 
  
సగటున ఈ ఏడాది మొబైల్‌ బిల్లులు 25-18 శాతం తగ్గుతాయని డెలాయిట్ హాస్కిన్స్‌ అండ్‌ సెల్స్‌ ఎల్‌ఎల్‌పీ పార్టనర్‌ హేమంత్‌ జోషి అన్నారు. వచ్చే ఏడాది 30 శాతం పడిపోయే అవకాశాలున్నాయని అంచనావేస్తున్నారు. రెండంకెల స్థాయిలో కూడా ధరలు పడిపోవచ్చని కేపీఎంజీ చెబుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments