Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2 వేలకే స్మార్ట్‌ఫోన్ రావాలి... గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్

దేశీయ అవసరాలకోసం రూ.2 వేల ధర కలిగిన (30 డాలర్ల లోపు) స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించాల్సిన అవసరం ఉందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. తద్వారా ఇంటర్నెట్ వినిమయం పెరుగడంతోపాటు డిజిటల్ పరిధిలోకి మరింత మ

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2017 (05:57 IST)
దేశీయ అవసరాలకోసం రూ.2 వేల ధర కలిగిన (30 డాలర్ల లోపు) స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించాల్సిన అవసరం ఉందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. తద్వారా ఇంటర్నెట్ వినిమయం పెరుగడంతోపాటు డిజిటల్ పరిధిలోకి మరింత మంది చేరేందుకు అవకాశం ఉంటుందన్నారు. 
 
తాను 23 సంవత్సరాల క్రితం చదువుకున్న ఐఐటీ-ఖరగ్‌పూర్‌ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. ప్రాంతీయ భాషల్లో పనిచేసే స్మార్ట్‌ఫోన్లపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, అప్పుడే దేశవ్యాప్తంగా అనుసంధానం మెరుగుపడనున్నదని చెప్పారు. దీనివల్ల డిజిటల్ ఎకానమిలో భారత్ గ్లోబల్ ప్లేయర్‌గా అవతరించనున్నదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 
 
2014లో గూగుల్.. ఆండ్రాయిడ్ వన్‌తో కుదుర్చుకున్న ఒప్పందంతో స్మార్ట్‌ఫోన్ రంగంలోకి అడుగుపెట్టింది. మార్కెట్లోకి విడుదల చేసే సమయంలో ఫోన్ ధర రూ.6,399గా ఉంది. దీనికంటే మెరుగైన అత్యాధునిక ఫీచర్స్, తక్కువ ధర కలిగిన స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి రావడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. 

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments