Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్‌ఫోన్లపై 10 - 14 శాతం మేరకు ధరలు తగ్గించిన సోనీ

సోనీ ఇండియా కంపెనీ తన ఫోన్ ఉత్పత్తులైన స్మార్ట్‌ఫోన్లపై ధరలను ఏకంగా 10 నుంచి 14 శాతం మేరకు తగ్గించింది. ఈ తగ్గించిన ధరలు ఈనెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. సోనీ కంపెనీ తయారు చేస్తున్న స్మార్ట్ ఫోన

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (06:46 IST)
సోనీ ఇండియా కంపెనీ తన ఫోన్ ఉత్పత్తులైన స్మార్ట్‌ఫోన్లపై ధరలను ఏకంగా 10 నుంచి 14 శాతం మేరకు తగ్గించింది. ఈ తగ్గించిన ధరలు ఈనెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. సోనీ కంపెనీ తయారు చేస్తున్న స్మార్ట్ ఫోన్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఎక్స్‌పీరియా ఎక్స్‌, జెడ్‌ 5లు ఉన్నాయి. 
 
సోనీ ఎక్స్‌పిరియా ఎక్స్‌ ధర ఆరంభంలో రూ.48,990 ఉండగా, ఇప్పుడు రూ.10 వేలు తగ్గి రూ.38,990కి చేరుకుంది. అలాగే, ఎక్స్‌పిరియా జెడ్‌5 ప్రీమియం ధర రూ.55,990 కాగా, దీని ధరలో 14 శాతం కోతపెట్టింది. దీంతో ఎనిమిది వేలు తగ్గి రూ.47,990కే ఇది లభిస్తోంది. భారత్‌లో ప్రీమియం కేటగిరి స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో సోనీ కంపెనీ సత్తా చాటుతోంది. 
 
మరోవైపు... స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ భారత్‌లో అత్యంత శరవేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం భారత్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో 25.1శాతం వాటాతో శామ్‌సంగ్‌ది ప్రథమ స్థానంలో  ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో మైక్రోమాక్స్‌ (12.9శాతం), లెనోవో గ్రూప్‌ (7.7శాతం), ఇంటెక్స్‌ (7.1శాతం) ఉన్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments