శాంసంగ్ గెలాక్సీ ఆన్ నెక్ట్స్ లాంచ్... ధర రూ.18,490.. ఫీచర్లివే...
కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తి కంపెనీ శాంసంగ్ తన కొత్త స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. 'గెలాక్సీ ఆన్ నెక్స్ట్' పేరుతో భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మిడ
కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తి కంపెనీ శాంసంగ్ తన కొత్త స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. 'గెలాక్సీ ఆన్ నెక్స్ట్' పేరుతో భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మిడ్ సెగ్మెంట్ స్మార్ట్ఫోన్ ధరను రూ.18,490గా కంపెనీ నిర్ణయించింది.
ఈ సందర్భంగా శాంసంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మను శర్మ స్పందిస్తూ... 2.5డీ గొరిల్లా గ్లాస్, పవర్ఫుల్ ఎనిమిదో కోర్ ప్రాసెసర్ సపోర్టుతో ఇది పని చేస్తుందన్నారు. పైగా గెలాక్సీ సిరీస్ ఫోన్లను లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఫోన్లో యూజర్ల సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ను కొత్తగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎస్ పవర్ ప్లానింగ్, ఎస్ సెక్యూర్ వంటి ఫీచర్లను డాటా సెక్యూర్ కోసం పొందుపరచడం మరో ప్రత్యేకత అని తెలిపారు.