Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌: డిసెంబర్ 25వరకు గడువు పొడిగింపు

దేశంలో ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. మొదటి నుంచి వివిధ ఆఫర్లతో కోట్లాది వినియోగదారులను తమవైపు తిప్పుకున్న జియో, ఇటీవల ప్రకటించిన ట్రిపుల్ క్యాష

Webdunia
మంగళవారం, 19 డిశెంబరు 2017 (18:13 IST)
దేశంలో ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. మొదటి నుంచి వివిధ ఆఫర్లతో కోట్లాది వినియోగదారులను తమవైపు తిప్పుకున్న జియో, ఇటీవల ప్రకటించిన ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. తాజాగా ఈ ఆఫర్ గడువును తొలుత నవంబర్ 25వ తేదీగా నిర్ణయించింది. 
 
ప్రస్తుతం వినియోగదారుల నుంచి మంచి స్పందన రావడంతో ఆ గడువును డిసెంబర్ 15దాకా పొడిగించింది. ఈ గడువును జియో మళ్లీ పొడిగించింది. దీనిప్రకారం డిసెంబర్ 25వ తేదీ వరకు జియో వినియోగదారులు ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది.

ఈ ఆఫర్ కింద వినియోగదారులు రూ.399.. ఆపైన విలువ గల ప్లాన్‌ను జియో యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే రూ.400 విలువ గల ఎనిమిది వౌచర్లు లభిస్తాయని ప్రకటించింది. వీటిని యాత్రా, రిలయన్స్ ట్రెండ్స్ సైట్లలో వినియోగించుకోవచ్చు. ఇలా మొత్తంగా రూ.2599 విలువైన ప్రయోజనాలను జియో కస్టమర్లకు ఆఫర్ చేసింది. 
 
ఈ ట్రిపుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ కింద జియో నవంబరులో రూ.2,599 వరకు క్యాష్‌ బ్యాక్‌ను ప్రకటించింది. జియో ప్రైమ్ ఖాతాదారులకు మాత్రం రూ.399కి రీఛార్జ్ చేసుకునే కస్టమర్లు ఈ ప్లాన్ ద్వారా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌‌లు, రోజుకు 1జీబీ, 70 రోజులకు 4జీ డేటాను పొందే అవకాశాన్ని కల్పించింది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments