Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌: డిసెంబర్ 25వరకు గడువు పొడిగింపు

దేశంలో ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. మొదటి నుంచి వివిధ ఆఫర్లతో కోట్లాది వినియోగదారులను తమవైపు తిప్పుకున్న జియో, ఇటీవల ప్రకటించిన ట్రిపుల్ క్యాష

Webdunia
మంగళవారం, 19 డిశెంబరు 2017 (18:13 IST)
దేశంలో ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. మొదటి నుంచి వివిధ ఆఫర్లతో కోట్లాది వినియోగదారులను తమవైపు తిప్పుకున్న జియో, ఇటీవల ప్రకటించిన ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. తాజాగా ఈ ఆఫర్ గడువును తొలుత నవంబర్ 25వ తేదీగా నిర్ణయించింది. 
 
ప్రస్తుతం వినియోగదారుల నుంచి మంచి స్పందన రావడంతో ఆ గడువును డిసెంబర్ 15దాకా పొడిగించింది. ఈ గడువును జియో మళ్లీ పొడిగించింది. దీనిప్రకారం డిసెంబర్ 25వ తేదీ వరకు జియో వినియోగదారులు ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది.

ఈ ఆఫర్ కింద వినియోగదారులు రూ.399.. ఆపైన విలువ గల ప్లాన్‌ను జియో యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే రూ.400 విలువ గల ఎనిమిది వౌచర్లు లభిస్తాయని ప్రకటించింది. వీటిని యాత్రా, రిలయన్స్ ట్రెండ్స్ సైట్లలో వినియోగించుకోవచ్చు. ఇలా మొత్తంగా రూ.2599 విలువైన ప్రయోజనాలను జియో కస్టమర్లకు ఆఫర్ చేసింది. 
 
ఈ ట్రిపుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ కింద జియో నవంబరులో రూ.2,599 వరకు క్యాష్‌ బ్యాక్‌ను ప్రకటించింది. జియో ప్రైమ్ ఖాతాదారులకు మాత్రం రూ.399కి రీఛార్జ్ చేసుకునే కస్టమర్లు ఈ ప్లాన్ ద్వారా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌‌లు, రోజుకు 1జీబీ, 70 రోజులకు 4జీ డేటాను పొందే అవకాశాన్ని కల్పించింది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments