Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో దివాలీ ధన్ ధనా ధన్... ఎయిర్‌టెల్‌కి దిమ్మతిరిగే షాక్... ఏంటో తెలుసా?

రిలయన్స్ జియో తన ప్రత్యర్థులను లేవలేని దెబ్బలు తీసేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేసుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. జియో రూ. 1500 ఫీచర్ ఫోన్‌కు పోటీగా ఎయిర్‌టెల్ కొత్త స్మార్ట్ ఫోన్‌ను అత్యంత తక్కువ ధరకే మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2017 (14:00 IST)
రిలయన్స్ జియో తన ప్రత్యర్థులను లేవలేని దెబ్బలు తీసేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేసుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. జియో రూ. 1500 ఫీచర్ ఫోన్‌కు పోటీగా ఎయిర్‌టెల్ కొత్త స్మార్ట్ ఫోన్‌ను అత్యంత తక్కువ ధరకే మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అంతే జియో మళ్లీ మరో అస్త్రాన్ని సంధించింది. 
 
రూ. 399 రీచార్జ్ పైన 100 శాతం క్యాష్ బ్యాక్‌ను అందిస్తామనీ, దానికి 'జియో దివాలీ ధన్ ధనా ధన్' ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు దీన్ని అందిపుచ్చుకోవచ్చని వెల్లడించింది. ఇది మూడు నెలల పాటు చెల్లుబాటవుతుందనీ, రూ. 50 విలువగల 8 ఓచర్లు లభిస్తాయని తెలిపింది. 
 
ఈ కూపన్లను నవంబర్ 15 తరువాత రీచార్జ్ కూపన్లుగా వాడుకోవచ్చని పేర్కొంది. ఈ అవకాశం వినియోగదారులకు ఇవాళ్టి నుంచి దీపావళి వరకూ అందుబాటులో వుంచుతున్నట్లు వెల్లడించింది. మరి జియో దెబ్బకు ఎయిర్ టెల్ ఎలాంటి ప్లాన్ వేస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments