Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఉచితం' పొడిగిస్తున్నామంటూ మెసేజ్ రాలేదా? డోంట్‌వర్రీ అంటున్న రిలయన్స్ జియో

రిలయన్స్ జియో వెల్‌కమ్ ఆఫర్ కింద మొబైల్ సేవలను పొందుతున్న ఖాతాదారులందరికీ ఆ సంస్థ సమాచారం తెలిపింది. వెల్‌కమ్ ఆఫర్ కింద జియో కస్టమర్లుగా ఉన్నప్పటికీ.. "మార్చి 31 వరకూ ఉచిత డేటా, వాయిస్ కాల్స్ చేసుకోవచ

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (13:56 IST)
రిలయన్స్ జియో వెల్‌కమ్ ఆఫర్ కింద మొబైల్ సేవలను పొందుతున్న ఖాతాదారులందరికీ ఆ సంస్థ సమాచారం తెలిపింది. వెల్‌కమ్ ఆఫర్ కింద జియో కస్టమర్లుగా ఉన్నప్పటికీ.. "మార్చి 31 వరకూ ఉచిత డేటా, వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు" అంటూ మీకు రిలయన్స్ జియో నుంచి స్మార్ట్‌ఫోన్‌కు మెసేజ్ రాలేదా? ఉచిత ఆఫర్‌పై మెసేజ్ రాకున్నా ఆఫర్ కొనసాగుతుందని ఆందోళన చెందుతున్న కస్టమర్లకు రిలయన్స్ జియో స్పష్టంచేసింది. 
 
ఈ మేరకు ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా)కు వివరణ ఇస్తూ, తామందించిన ప్రమోషనల్ ఆఫర్, న్యూ ఇయర్ ఆఫర్ వేరువేరని స్పష్టం చేసింది. అందువల్ల డిసెంబర్ 31 వరకూ ఇచ్చిన ఉచిత ఆఫర్‌కు తాజా ఆఫర్ కొనసాగింపు కాదని తేల్చి చెప్పింది. మొదటి ఆఫర్‌లో డేటా కోసం రీచార్జ్ చేసుకునే వెసులుబాటు లేదనీ, కానీ.. న్యూ ఇయర్ ఆఫర్ కింద డేటా కోసం రీచార్జ్ చేసుకునే సౌలభ్యం ఉందని ట్రాయ్‌కు వివరించింది. 
 
అయితే, వెల్‌కమ్ ఆఫర్ కింద ఉన్న జియో వినియోగదారులందరికీ కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా కొంతమందికి మెసేజ్ వెళ్లలేదని, ఈ విషయంలో కంగారు పడనక్కర్లేదనీ, మరో 90 రోజులు ఉచిత సేవలను అందుకోవచ్చని, వినియోగించిన డేటాకు బిల్లు పంపుతున్నట్టు వచ్చిన ఆరోపణలు నిజం కాదని తెలిపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments