Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో టారిఫ్ ఇదే... రూ. 12,000 కోట్లు నష్టపోయిన ఐడియా, ఎయిర్‌టెల్

ఉచిత ఇంటర్నెట్ పేరిట సంచలనం సృష్టించిన జియో ఇన్ఫోకామ్ భవిష్యత్ ప్రణాళికను పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ వెల్లడించారు. టెలికామ్ కంపెనీలకు షాక్ ఇస్తూ ఇటీవలే రిలయన్స్‌లో చేరిన జియో గురించి గురువారం జరిగ

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2016 (16:03 IST)
ఉచిత ఇంటర్నెట్ పేరిట సంచలనం సృష్టించిన జియో ఇన్ఫోకామ్ భవిష్యత్ ప్రణాళికను పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ వెల్లడించారు. టెలికామ్ కంపెనీలకు షాక్ ఇస్తూ ఇటీవలే రిలయన్స్‌లో చేరిన జియో గురించి గురువారం జరిగిన 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో అనిల్ అంబానీ మాట్లాడుతూ.. కస్టమర్లకు వరాల జల్లు కురిపించారు. దేశంలో 2017 నాటికి 90శాతం గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ముకేశ్ అంబానీ వెల్లడించారు. 
 
ఇంకా 5జీ 6 జీ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. 5 పైసలకే ఒక ఎంబీ, రూ.50కే జీవీ డాటా సేవలను అందించనున్నట్టు ప్రకటించారు. 300 పైగా ఛానల్స్ లైవ్‌లో చూడొచ్చు. అలాగే 28 లక్షల కాలర్ టూన్స్, 6 వేల సినిమాలు, 60 వేల మ్యూజిక్ ఉచితంగా పలు అప్లికేషన్స్ అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా పది ప్రధాన ప్లాన్లతో ముందుకు వస్తున్నట్టు ముకేశ్ ప్రకటించారు. 
 
ఇకపోతే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డ్రీమ్ ప్రాజెక్టు డిజిటల్ ఇండియాకు జియో సేవలను అంకితం చేయనున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు. దేశంలో కాకుండా ప్రపంచంలో అతి తక్కువ ధరలకు జియో సేవల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. రిలయన్స్ జియో సేవలద్వారా ఏ నెట్ వర్క్‌కైనా ఉచిత రోమింగ్, ఉచిత వాయిస్ కాల్స్ సేవలు అందిస్తున్నట్టు ప్రకటించారు. ప్రతి భారతీయుడి జీవితం డిజిటల్‌గా రూపాంతరం చెందబోతోందన్నారు ఇందులో జియో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఇంకా దేశంలో కోటి వైఫై కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. 
 
రిలయన్స్ జియోను పరిచయం చేస్తుండగానే ఐడియా సెల్యులార్, భారతీ ఎయిర్‌టెల్ కంపెనీలు రూ. 12,000 కోట్ల మేర నష్టపోయాయి. ఈ కంపెనీల ఈక్విటీ వాటా విలువ మధ్యాహ్నం ఐడియా 9.58 శాతం నష్టంతో రూ. 84.50 వద్ద, భారతీ ఎయిర్‌టెల్ 6.30 శాతం నష్టంతో రూ. 310.75 వద్దా కొనసాగుతున్నాయి. జియో దెబ్బకు బాగా నష్టపోయిన టాప్ కంపెనీల్లో ఐడియా, ఎయిర్‌టెల్ నిలిచాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments