షియోమీకి షాక్.. దిగుమతిని ఆపండి.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (15:26 IST)
చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీకి షాక్ తగిలింది. ఆ కంపెనీకి చెందిన అన్ని ఉత్పత్తుల తయారీ, అమ్మకాలతోపాటు దిగుమతిని కూడా నిలిపివేయాలని కోరుతూ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఫిలిప్స్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. తమ కంపెనీకి చెందిన పలు పేటెంట్లను షియోమీ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఫిలిప్స్.. కోర్టులో కేసు వేసింది. 
 
షియోమీకి చెందిన ఉత్పత్తుల తయారీ, అసెంబ్లింగ్‌, దిగుమతితోపాటు అడ్వర్టయిజ్‌మెంట్లను కూడా నిలిపివేయాలని ఫిలిప్స్ తన పిటిషన్‌లో కోర్టును కోరింది. తమ కంపెనీకి చెందిన హెచ్ఎస్‌పీఏ, హెచ్ఎస్‌పీఏ ప్లస్‌, ఎల్టీఈ టెక్నాలజీలకు చెందిన పేటెంట్లను షియోమీ ఉల్లంఘించిందని ఫిలిప్స్ ఆరోపించింది.
 
అయితే ఫిలిప్స్ పిటిషన్ పై స్పందించిన కోర్టు ఆ కంపెనీని బ్యాంకుల్లో రూ.1000 కోట్ల నగదు నిల్వలను మెయింటెయిన్ చేయాలని ఆదేశించింది. ఇక ఈ కేసును జనవరి 18వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఆ రోజు కోర్టు ఏం తీర్పు ఇస్తుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments