Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేటీఎం ద్వారా మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నారా?

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (10:06 IST)
ప్రముఖ పేమెంట్స్ యాప్ పేటీఎం వాడుక దారులకు షాకింగ్ న్యూస్. పేటీఎం ద్వారా మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలనుకునేవారికి ఇక సర్ ఛార్జ్‌లు తప్పవు. ఎందుకంటే పేటీఎం ఇటీవల రీఛార్జ్‌పై సర్‌ఛార్జ్ వసూలు చేయడం ప్రారంభించింది. 
 
ఈ రుసుము రూ. 1 నుండి రూ. 6 వరకు ఉంటుంది. సర్‌ఛార్జ్ ఎంత అనేది మీరు చేసుకునే రీఛార్జ్ మొత్తంపై ఆధారపడి ఉంటుంది. ఈ ఛార్జీలు అన్ని పేటీఎం మొబైల్ రీఛార్జ్‌లపై వర్తించనుంది. గతేడాది.. ఫోన్‌పే తన కస్టమర్‌లకు రీఛార్జ్‌పై సర్‌ఛార్జ్‌ని అమలు చేసిని విషయం తెలిసిందే. 
 
ఈ విషయంపై ట్విట్టర్‌లో చాలా మంది వినియోగదారులు తమ పోస్టుల ద్వారా అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్చి నుంచే పేటీఎం ఈ ఛార్జీలను అమల్లోకి తీసుకురాగా.. ఇప్పుడు పెద్ద సంఖ్యలో వినియోగదారులకు ఛార్జీలు పడుతున్నాయి. 
 
ప్రస్తుతం.. ఈ రుసుము రూ. 100 కంటే ఎక్కువ రీఛార్జ్‌పై కనిపిస్తోంది. 2019 సంవత్సరంలో, పేటీఎం దాని వినియోగదారుల నుండి సర్‌ఛార్జ్ రుసుములను వసూలు చేయదని చెప్పింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments