Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతే టార్గెట్.. ఒప్పో-17 సిరీస్‌ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్లు.. ధరెంతో తెలుసా?

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (13:18 IST)
Oppo
ఒప్పో నుంచి ఒప్పో-17 సిరీస్‌లో ఒప్పో ఎఫ్ 17, ఒప్పో ఎఫ్ 17 ప్రో స్మార్ట్‌ఫోన్లు భారత్‌‌లో విడుదల అయ్యాయి. సెప్టెంబర్‌ 7 నుంచి ఒప్పో ఎఫ్‌ 17 ప్రొ అమ్మకాలు ప్రారంభం కానుండగా ఎఫ్‌ 17 ఫోన్‌ విక్రయాలు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయో కంపెనీ వెల్లడించలేదు.
 
చైనాకు చెందిన ఈ ప్రముఖ మొబైల్‌ మేకర్‌ ఒప్పో నుంచి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్లలో.. ఒప్పో ఎఫ్ 17 ప్రో డ్యూయల్ సెల్ఫీ కెమెరాలతో వస్తోంది. ఒప్పో ఎఫ్ 17లో సెల్ఫీలు తీయడానికి ముందు భాగంలో ఒకే కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. 
 
యువతను ఆకట్టుకునే రీతిలో ఎఫ్‌17 సిరీస్‌ ఫోన్లు మెటల్‌ ఫినీష్‌ డిజైన్‌తో వస్తున్నాయి. భారత్‌లో ఒప్పో ఎఫ్ 17 ప్రో 8జీబీ + 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 22,990గా ఉంది. ఈ ఫోన్‌ మ్యాజిక్‌ బ్లాక్‌, మ్యాజిక్‌ బ్లూ, మెటాలిక్‌ వైట్‌ కలర్లలో విడుదలైంది.
 
ఎఫ్‌17 ఫోన్‌ నేవీ బ్లూ, క్లాసిక్‌ సిల్వర్‌, డైనమిక్‌ ఆరెంజ్‌ రంగుల్లో రిలీజ్‌ కాగా దీని ధర ఇంకా వెల్లడించలేదు. 4జీబీ + 64జీబీ, 4జీబీ + 128జీబీ, 6జీబీ + 128జీబీ, 8జీబీ + 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో ఫోన్‌ లభించనుంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments