Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియోను ఎవ్వరూ తొలి సిమ్‌గా ఉపయోగించట్లేదు..

రిలయన్స్ జియో వినియోగదారుల్లో కేవలం 18 శాతం మందే సిమ్‌ను తొలి సిమ్‌గా ఉపయోగిస్తున్నారు. రిలయన్స్ జియో సిమ్‌ను 82 శాతం మంది రెండో సిమ్‌గా ఉపయోగిస్తున్నట్లు బెంగళూరుకు చెందిన మార్కెట్ రీసెర్చ్ ఏజెన్సీ వ

Webdunia
మంగళవారం, 20 జూన్ 2017 (09:27 IST)
రిలయన్స్ జియో వినియోగదారుల్లో కేవలం 18 శాతం మందే సిమ్‌ను తొలి సిమ్‌గా ఉపయోగిస్తున్నారు. రిలయన్స్ జియో సిమ్‌ను 82 శాతం మంది రెండో సిమ్‌గా ఉపయోగిస్తున్నట్లు బెంగళూరుకు చెందిన మార్కెట్ రీసెర్చ్ ఏజెన్సీ వెలోసిటీ ఎంఆర్ పేర్కొంది. 86 శాతం మంది ఖాతాదారులు జియోను కొనసాగించడానికి కారణం ఉచిత ఆఫరేనని వెలోసిటీ వెల్లడించింది. 
 
ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, పుణె, అహ్మదాబాద్ నగరాల్లో 2 వేల మందిపై వెలోసిటీ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో జియోను ఎవ్వరూ తొలి సిమ్‌గా ఉపయోగించట్లేదని ఆ సంస్థ తెలిపింది. కానీ కాల్ డ్రాప్స్ విషయంలో జియో 54 శాతం కాల్ డ్రాప్స్‌ను నమోదు చేసుకుంది. తద్వారా ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, బీఎస్ఎన్ఎల్ కంటే మెరుగైన స్థానంలో జియో నిలిచింది.
 
ఇదిలా ఉంటే.. 90 శాతం రిలయన్స్ జియో యూజర్లు జియో ప్రైమ్ మెంబర్‌షిప్ ప్లాన్‌లో ఉన్నారని.. 76 శాతం మంది జియో సర్వీసు ముగిసేంతవరకు ఉపయోగించుకోవాలనుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది. 84మంది జియో యూజర్లు రూ.303, రూ.309 ప్యాక్‌లను ఉపయోగిస్తున్నారని సర్వే పేర్కొంది.

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments