Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.1కే వన్ ప్లస్ 3 మోడల్ స్మార్ట్ ఫోన్.. దీపావళి ఫ్లాష్ సేల్.. అక్టోబర్ 24 నుంచి 26 వరకు..?

ఇంటర్నెట్ ప్రభావంతో స్మార్ట్‌ఫోన్ల అమ్మకం శరవేగంలో జరుగుతున్నాయ్. ప్రస్తుతం చైనా కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ పెరిగిపోతోంది. ఇందుకు వినియోగదారులను ఆకట్టుకునేందుకు చైనా కంపెనీలు చేస్తున్న

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (11:55 IST)
ఇంటర్నెట్ ప్రభావంతో స్మార్ట్‌ఫోన్ల అమ్మకం శరవేగంలో జరుగుతున్నాయ్. ప్రస్తుతం చైనా కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ పెరిగిపోతోంది. ఇందుకు వినియోగదారులను ఆకట్టుకునేందుకు చైనా కంపెనీలు చేస్తున్న జిమ్మిక్కులే కారణం. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ కూడా ఒక్క రూపాయికే వన్‌ ప్లస్ 3 మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామని తాజాగా ప్రకటించింది.
 
దీపావళి సందర్భంగా ఈ ఫ్లాష్ సేల్ ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది. అక్టోబర్ 24 నుంచి 26 వరకూ ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు, 6 గంటలకు, 8 గంటలకు ఈ ఫ్లాష్ డీల్‌లో వినియోగదారులు వన్ ప్లస్ 3ని బుక్ చేసుకోవాలని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇలా బుక్ చేసిన వారికి లక్కీ డ్రా ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామని చెప్పారు. ఈ రెండు రోజుల్లో వీలైనన్ని ఎక్కువ బుకింగ్స్ సాధించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
 
గతంలో జియోమి సంస్థ 1 రూపాయికే స్మార్ట్‌ఫోన్ ఇస్తామని వినియోగదారుల్లో ఆసక్తి రేకెత్తించిన సంగతి తెలిసిందే. అయితే చాలామంది వినియోగదారులు మాత్రం ఈ ఫ్లాష్ సేల్‌ ఒట్టి బోగస్ అంటూ కొట్టిపారేస్తున్నారు. 1 రూపాయికే స్మార్ట్‌ఫోన్ అని ప్రకటించడంతో చాలామంది బుకింగ్ టైం వరకూ వేచి చూశారు. తీరా కౌంట్‌డౌన్ ప్రారంభమయ్యే సమయానికి ఔట్ ఆఫ్ స్టాక్ అని కనిపించడంతో అందరిలోనూ నిరాశ నెలకొంది. మరి వన్ ప్లస్ 3 మోడల్ సేల్స్ ఏమేరకు అనుకూలిస్తాయో వేచి చూడాలి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments