Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై ఎఫ్ఐఆర్: తొలగించిన పోలీసులు

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2021 (21:18 IST)
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై నమోదైన ఎఫ్ఐఆర్‌ను యూపీలోని వారణాసి పోలీసులు తొలగించారు. ప్రధాని మోదీని కించపరిచేట్టుగా ఉన్న ఓ వీడియో రూపకల్పనలో వీరి ప్రమేయం ఉందన్న ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు పెట్టారు. సుందర్ పిచాయ్‌తో పాటు గూగుల్‌కి చెందిన మరో ముగ్గురు ఉన్నతాధికారుల పేర్లు కూడా ఉన్నప్పటికీ.. చివరకు అసలు విషయం తెలిసి.. నాలుక్కరుచుకున్నారు. 
 
ఈ వీడియో మొదట వాట్సాప్ గ్రూప్‌లో, ఆ తరువాత యూ ట్యూబ్ లో సర్క్యులేట్ అయిందని, దానికి 5 లక్షల వ్యూస్ వచ్చాయని, వారణాసి లోని ఓ వ్యక్తి పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. ఆ వెంటనే తన మొబైల్ ఫోన్‌కు ఎనిమిదిన్నర వేల బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆయన పేర్కొన్నాడు. సుందర్ పిచాయ్ సహా సంజయ్ కుమార్ గుప్తా తదితరుల పేర్లు ఈ ఎఫ్‌ఐ‌ఆర్‌లో ఉన్నాయి.
 
దీనిపై గూగుల్ స్పందన ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వీడియో సాంగ్‌ను ఘాజీపూర్ లోని మ్యుజిషియన్లు రూపొందించారని, వారితో బాటు రికార్డింగ్ స్టూడియో, స్థానిక మ్యూజిక్ లేబెల్ కంపెనీ నిర్వాహకులకు కూడా ఈ కేసుతో ప్రమేయమున్నట్టు పోలీసులు పేర్కొన్నారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments