Webdunia - Bharat's app for daily news and videos

Install App

2020కల్లా 5జీ సేవలు.. 10 వేల ఎంబీపీఎస్ వేగంతో...

ప్రస్తుతం 4జీ నామస్మరణ చేస్తున్న దేశీయ టెలికం రంగంలో వచ్చే మూడేళ్ళలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 2020కల్లా ఐదోతరం టెలికం సేవలు ప్రారంభించేందుకు వీలుగా రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు కేంద

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2017 (07:29 IST)
ప్రస్తుతం 4జీ నామస్మరణ చేస్తున్న దేశీయ టెలికం రంగంలో వచ్చే మూడేళ్ళలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 2020కల్లా ఐదోతరం టెలికం సేవలు ప్రారంభించేందుకు వీలుగా రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 
 
దీనిపై టెలికం మంత్రి మనోజ్ సిన్హా మాట్లాడుతూ, ఐదో తరం టెలికం సేవల లక్ష్యాలపై కసరత్తు చేసేందుకు వీలుగా ఉన్నత స్థాయి 5జీ కమిటీని ఏర్పాటు చేశాం. 2020లో అభివృద్ధి చెందిన మార్కెట్లతోపాటు భారత్‌లోనూ 5జీ సేవలు ప్రారంభించేందుకు వీలుంటుందని చెప్పారు. 
 
5జీ సేవలపై పరిశోధన, అధ్యయనం కోసం ప్రభుత్వం రూ.500 కోట్లతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తున్నది. భవిష్యత్ తరం టెలికం టెక్నాలజీ ద్వారా నగరాల్లో 10 వేల ఎంబీపీఎస్ (మెగాబైట్ పర్ సెకండ్), గ్రామాల్లో 1000 ఎంబీపీఎస్ వేగంతో సేవలందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 
 
3జీ, 4జీ విషయంలో అవకాశాన్ని కోల్పోయిన భారత్.. 5జీ టెక్నాలజీ ప్రమాణాలు, ఉత్పత్తుల అభివృద్ధి విషయంలో తనవంతు పాత్ర పోషించాలని అనుకుంటున్నదని మనోజ్ సిన్హా అన్నారు. 
 
వచ్చే 5-7 యేళ్ళలో భారత మార్కెట్లో 50 శాతం, గ్లోబల్ మార్కెట్లో 10 శాతం వాటా దక్కించుకునే లక్ష్యంతో గ్లోబల్ ఉత్పత్తులకు ధీటుగా మన దేశంలోనే 5జీ ఉత్పత్తులను అభివృద్ధి చేయడంతోపాటు తయారు చేసే దిశగా కృషి చేయనున్నాం అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం లోకేష్, కూటమి చైర్మన్ చంద్రబాబు: కలలు కంటున్న తమ్మారెడ్డి

బ్యాచ్‌లర్స్ జీవితంలో స్ట్రగుల్స్ ను మజాకా చేసుకుంటున్న సందీప్ కిషన్

Akira Nandan: అకీరా నందన్‌తో కలిసి పనిచేసేందుకు రెడీ.. విష్ణు వర్ధన్

వియత్నాంలో వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ ప్రీ ప్రొడక్షన్ చర్చలు

ఇంట్లోనే పురుషులుంటే.. వీధుల్లోకి మహిళలు వెళ్తే పరిస్థితి ఏంటి? చిన్మయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ పర్యటన: తాజా ఫ్యాషన్ ప్రపంచంలోకి ద వన్ అండ్ వోన్లీ

తర్వాతి కథనం
Show comments