Webdunia - Bharat's app for daily news and videos

Install App

కింద పడితే పగలదు... బ్రేక్ అయితే.. మోటొరోలా నుంచి కొత్త ఫోన్

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల యుగం నడుస్తోంది. దీంతో అన్ని ప్రధాన కంపెనీలు అత్యాధునిక ఫీచర్ ఫోన్ల తయారీపై దృష్టిపెడుతున్నాయి. తాజాగా మోటొరోలా నుంచి సరికొత్త పీచర్ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. దీనిప

Webdunia
గురువారం, 15 ఫిబ్రవరి 2018 (15:08 IST)
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల యుగం నడుస్తోంది. దీంతో అన్ని ప్రధాన కంపెనీలు అత్యాధునిక ఫీచర్ ఫోన్ల తయారీపై దృష్టిపెడుతున్నాయి. తాజాగా మోటొరోలా నుంచి సరికొత్త పీచర్ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. దీనిపేరు జెడ్2 ఫోర్స్ స్మార్ట్ ఫోన్. 
 
లెనోవోకు చెందిన ఈ స్మార్ట్ ఫోన్‌ను గురువారం డిల్లీ మార్కెట్‌లో ఆవిష్కరించారు. ఇది షట్టర్ ప్రూఫ్ డిస్ ప్లేతో, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్‌లో హై ఎండ్ చిప్ సెట్ 835తో వస్తుంది. షట్టర్ షీల్డ్ డిస్ ప్లే అన్నది ఎటువంటి గీతలు పడకుండా, స్క్రీన్ బ్రేక్ అవకుండా రక్షణ కోసం ఏర్పాటు చేసినది. కింద పడి స్క్రీన్ పగిలినా, బ్రేక్ అయినా నాలుగేళ్ల పాటు గ్యారంటీ ఇస్తోంది. దీన్ని లిమిటెడ్ ఎడిషన్‌గా మొటొరోలా విడుదల చేసింది.
 
ఇందులోని ఫీచర్లను పరిశీలిస్తే, డ్యుయల్ నానో సిమ్, ఆండ్రాయిడ్ ఓరియో 8.0, 5.5 అంగుళాల క్యూహెచ్ డీ (1140, 2560 పిక్సల్స్) పోలెడ్ షట్టర్ షీల్డ్ డిస్ ప్లే, నీరు పడినా చుక్క కూడా లోపలికి వెళ్లకుండా ఉండేందుకు వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్, క్వాల్ కామ్ 835 ఎస్ఓసీ, 6జీబీ ర్యామ్, 64 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ, 2టీబీ వరకు ఎక్స్ పాండబుల్ మెమొరీ, ఆండ్రెనో 540 జీపీయూ, వెనుక భాగంలో 13 మెగా పిక్సల్స్ డ్యుయల్ కెమెరా (సోనీ సెన్సార్ తో), డ్యుయల్ ఎల్ఈడీ ఫ్లాష్, ముందు భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్, 2730 ఎంఏహెచ్ బ్యాటరీ, కేవలం 15 నిమిషాల్లో 8 గంటలకు సరిపడా చార్జ్ చేసే టర్బో చార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments