విండోస్ ఫోన్లకు చెల్లుచీటి.. మైక్రోసాఫ్ట్ ప్రకటన

Webdunia
ఆదివారం, 20 జనవరి 2019 (11:57 IST)
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. విండోస్ ఫోన్లకు గుడ్‌బై చెప్పేసింది. పైగా, విండోస్ ఫోన్లను వాడుతున్న యూజర్లందరూ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ డివైజ్‌లకు వారాలని సూచన చేసింది. ఇకపై విండోస్‌ 10 మొబైల్‌ ఇక సపోర్ట్‌‌ చేయవని తెలిపింది. 2019 డిసెంబరు నాటికి ఈ ఫోన్లు పూర్తిగా పనిచేయవని తెలిపింది. 
 
'ఎండ్‌ ఆఫ్‌ సపోర్ట్‌'’ పేజీలో విండోస్‌ 10 మొబైల్‌, డిసెంబర్‌ 10 తర్వాత కొత్త సెక్యురిటీ అప్‌ డేట్లను తీసుకోవడం మానేసిందని యూజర్లకు తెలిపింది. విండోస్‌ 10 మొబైల్‌ ఓఎస్‌ సపోర్ట్‌‌ చేయడం ముగియడంతో, కస్టమర్లు ఆండ్రాయిడ్‌ లేదా ఐఓఎస్‌ డివైజ్‌‌లలోకి ఖచ్చితంగా మారాలని సూచన చేసింది.
 
కాగా, విండోస్ మొబైల్ 10 చివరి వెర్షన్‌ 1709. దీన్ని 2017వ సంవత్సరం అక్టోబరు నెలలో రిలీజ్ చేసింది. విండోస్‌ 10 మొబైల్‌‌ను ఆపివేస్తున్నామని 2017లోనే మైక్రోసాఫ్ట్‌‌ సంకేతాలిచ్చింది. దీని కోసం కొత్త ఫీచర్లను కానీ, హార్డ్‌‌వేర్‌ కానీ డెవలప్‌ చేయడం లేదని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rukmini Vasanth: రుక్మిణి వసంత క్యాజువల్ ప్యాకింగ్ క్లిప్ అభిమానుల ప్రశంసలు

Charan: డ్రైవింగ్ త్రూ పెద్ది మెమరీస్ పంచుకున్న రామ్ చరణ్, బుచ్చిబాబు

Virat Karna: నాగబంధం పోస్ట్-ప్రొడక్షన్ - విఎఫ్ఎక్స్ పనుల్లో బిజీ

Vadde Naveen: వడ్డే నవీన్ నటిస్తూ నిర్మించిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

Chiru 158: రెగ్యులర్ షూటింగ్ లో చిరంజీవి 158వ చిత్రం

తర్వాతి కథనం
Show comments