భారత స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ అయిన మైక్రోమ్యాక్స్ కంపెనీ మంగళవారం 'కాన్వాస్ మెగా 2' పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోనును ఆవిష్కరించింది. ఆరు అంగుళాల స్క్రీన్తో, సుదీర్ఘ కాలం బ్యాటరీ పనిచేసేలా ఈ ఫోనును తయారు చేసింది. దీని ధర రూ.7999గా నిర్ణయించింది.
ఈ ఫోన్ 6 అంగుళాల క్యూహెచ్డి డిస్ల్పేతో పాటు... 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 మెగాపిక్సల్ వెనుక కెమరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమరా, 1.3 జీహెచ్జడ్ క్వాడ్ కోర్ ప్రాసెస్సర్, 1జీవీ ర్యామ్, 8 జీవీ రోమ్ (32 జీవీ వరకు విస్తరించుకునే వెసులుబాటు), ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.0, బ్లూ టూత్ 4.0 వంటి అత్యాధునిక ఫీచర్లను కలిగివుంది.
ఈ సందర్భంగా ఆ కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ షుబ్జీత్ సేన్ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. 2014 -19 మధ్య కాలంలో మొబైల్ వీడియా ట్రాఫిక్ వృద్ధి రేటు 88 శాతం పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ముఖ్యంగా మొబైల్ గేమింగ్లో ఈ వృద్ధి రేటు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఫ్యాబ్లెట్ కేటగిరీలో 2015 సంవత్సరంలో 190 శాతం మేరకు వృద్ధిరేటు ఉండగా, ఇందులో తమ వాటా 15 శాతం మేరకు ఉందన్నారు.