వరల్డ్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ 4జి టెక్నాలజీతో సరికొత్త స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీనికి లూమియా 649 పేరు పెట్టింది. 4జీ టెక్నాలజీని సపోర్ట్ చేసే 'లూమియా 950'ని ఆ కంపెనీ సోమవారం భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ యేడాది డిసెంబర్ వరకు ఎయిర్టెల్ వినియోగదారులకు ప్రత్యేక ప్యాకేజీ కింద ఈ స్మార్ట్ ఫోన్ను అందిస్తామని ఈ కంపెనీ ఇప్పటికే ప్రకటించిన విషయంతెల్సిందే.
కాగా, లూమియా 950 ఫీచర్లను పరిశీలిస్తే 13 ఎంపీ రియర్ కెమెరా, 5.7 అంగుళాల హెచ్డీ స్క్రీన్, విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 సన్ లైట్ రీడబిలిటీ, 12 గిగా హెట్జ్ క్వాడ్ కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 400 ప్రాసెసర్, 32జీబీ ర్యామ్తో పాటు అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ధర 649 డాలర్లుగా నిర్ణయించారు.