Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరుద్యోగులకు శుభవార్త : ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా ఐటీ కంపెనీలు

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (09:25 IST)
దేశంలోని ఐటి కంపెనీలు నిరుద్యోగులకు శుభవార్త చెప్పాయి. దేశంలోని మూడు అతిపెద్ద ఐటీ కంపెనీలు మెరుగైన ఆర్థిక ఫలితాలను ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో అందుకున్నాయి. దీంతో మందగమనంలో నడుస్తున్న ఐటీ పరిశ్రమ తిరిగి కోలుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. 
 
ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ వరకూ ముగిసిన త్రైమాసికంలో దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీలు టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో 17,446 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించాయి. దీంతో ఈ సంవత్సరంలో దాదాపు లక్షా ఐదువేల మంది ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఈ కంపెనీలు హామీ ఇస్తున్నాయి.
 
ముఖ్యంగా, దేశంలో అతిపెద్ద ఐటీ సెక్టార్‌గా ఉన్న టీసీఎస్ జూన్ త్రైమాసికంలో రూ 9,000 కోట్ల లాభాన్ని నమోదుచేయగా, విప్రో సంస్థ కూడా మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఇక, మరో ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ కూడా మొదటి త్రైమాసికంలో గత పదేళ్ళలో అత్యధిక లాభాలను ఆర్జించింది. 
 
ఇది కరోనా కష్టకాలంలోనూ ఐటీ రంగం వృద్ధిని చూసిస్తోందని, అందువల్ల జూలై-సెప్టెంబరులో 6000 మంది ఐటి నిపుణులకు ఉద్యోగాలు ఇస్తామని, 2021-22లో 30,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇస్తామని ఈ సందర్భంగా విప్రో హామీ ఇచ్చింది.
 
కరోనా కారణంగా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్నాయి. ఇది మంచి ఫలితాలను రాబట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆన్‌లైన్ విద్య వంటి కార్యకలాపాల వలన కంపెనీలకు పెద్ద ఒప్పందాలు వచ్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments