Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గూగుల్ పే'ని వినియోగిస్తున్నారా..? ఆ లింకుతో జాగ్రత్త.. క్లిక్ చేశారో?

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (14:07 IST)
గూగుల్ పేను వినియోగిస్తున్నారా.. అయితే ఆ లింకుతో జాగ్రత్త అంటున్నారు.. ఐటీ నిపుణులు. లింకుపై క్లిక్ చేస్తే డబ్బు పొందవచ్చు అని మెసేజ్ వస్తే ఆ లింకును క్లిక్ చేయకపోవడమే మంచిదని వారు చెప్తున్నారు. ఆ లింకుపై క్లిక్ చేస్తే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఖాళీ అయ్యే ప్రమాదం వుందని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ఇందుకు సైబరాబాద్‌లో జరిగిన సంఘటనే నిదర్శనం. వివరాల్లోకి వెళితే.. సైబరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్‌కు ఇటీవల గూగుల్ పే తరహాలోనే ఓ మెసేజ్ వచ్చింది. ఆర్బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం మీ కేవైసీ, ఖాతా వివరాలను వెంటనే అప్‌డేట్ చేసుకోండి. లేకపోతే మీ బ్యాంకు లావాదేవీలు నిలిచిపోతాయని అందులో ఉంది. అందులో ఓ గూగుల్ లింక్ కూడా ఉంది. దీంతో ఆయన దాన్ని క్లిక్ చేసి వివరాలు నమోదు చేశారు. అవి సైబర్ నేరగాళ్లకు చిక్కడంతో ఆయన అకౌంట్లో ఉన్న రూ.5.29 లక్షలు మాయమయ్యాయి.
 
ఆ లింకు మాత్రమే కాకుండా.. ఇతర సోషల్ మీడియాల్లో షేరవుతున్న గూగుల్ పే స్క్రాచ్ కార్డు లింకును క్లిక్ చేస్తే చాలా డేంజర్. ఆ లింకు క్లిక్ చేస్తే రూ.500 నుంచి రూ.5000 వరకు వస్తాయంటూ వస్తున్న ఆ మెసేజులు క్లిక్ చేసినా, అందులో మీ వివరాలు పొందుపరిచినా మీ అకౌంట్ మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments