తెలంగాణలో ఇన్ఫోసిస్ భారీ పెట్టుబడి.. ఏపీఐఐసీ నుంచి 447 ఎకరాలు

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (13:01 IST)
కరోనా దెబ్బకు దాదాపు అన్ని రంగాలు కుదేలైనా.. ఐటీ రంగంపై మాత్రం ఆ ఎఫెక్ట్ అంతగా పడలేదు. వర్క్ ఫ్రం హోం ద్వారా ప్రొడక్టివిటీ ఏ మాత్రం తగ్గలేదని ఆయా కంపెనీలు చెబుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా తెలంగాణలో భారీగా పెట్టుబడులకు సిద్ధమైంది. 
 
రాష్ట్రంలో రూ. 2500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నిధులతో హైదరాబాద్‌లోని పోచారం క్యాంపస్‌ను విస్తరించనుంది ఇన్ఫోసిస్. దీంతో దాదాపు 20 వేల మందికి నూతనంగా ఉద్యోగవకాశాలు రానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
 
ఈ నిధులతో సాఫ్ట్ వేర్ డవలప్మెంట్ బ్లాక్‌లు, ఫుడ్ కోర్టులు, ఆడిటోరియం, ఇతర సదుపాయల కోసం బిల్డింగ్, మల్టిలెవల్ కార్ పార్కింగ్‌ను 329.84 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008వ సంవత్సరంలో ఏపీఐఐసీ నుంచి 447 ఎకరాలను తీసుకుంది. ఘటకేసర్ మండలంలోని పోచారం క్యాంపస్ 117.24 ఎకరాల్లో ఇప్పటికే విస్తరించి ఉంది. ఈ తాజా విస్తరణ ద్వారా మరో నాలుగు ఐటీ డవలప్మెంట్ బ్లాకులను కంపెనీ నిర్మించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments