Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇపుడు ఐబీఎం వంతు... 3900 మంది ఉద్యోగుల తొలగింపుకు నిర్ణయం

Webdunia
గురువారం, 26 జనవరి 2023 (15:03 IST)
మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే టెక్ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్‌తో పాటు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌ వంటి కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ నిరంతరాయంగా సాగుతోంది. ఇపుడు ఐబీఎం వంతు వచ్చింది. ఈ ఐటీ దిగ్గజ కంపెనీలో ఏకంగా 3900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. అసెట్ డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. 
 
అయితే, ఈ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల్లో తొలగించిన ఉద్యోగుల సంఖ్య కేవలం 1.5 శాతం మాత్రమేనని పేర్కొంది. అయితే, క్లయింట్ ఫేసింగ్ రీసెర్స్ డెవలప్‌మెంట్ విభాగాల్లో నియామకాలు కొనసాగుతున్నాయని ఐబీఎం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జేమ్స్ కవనాగ్ తెలిపారు. 
 
ఐబీఎం తీసుకున్న తాజా నిర్ణయంతో ఆ కంపెనీ షేర్లు ఏకంగా రెండు శాతం పడిపోయాయి. మరోవైపు, ఉద్యోగులను తొలగించాలని ఐబీఎం తీసుకున్న నిర్ణయం వెనుక ప్రధాన కారణం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ నగదు లక్ష్యాలు అందుకోలేక పోవడమే కారణమని వారు అభిప్రాయపడుతున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments