ఫేస్‌బుక్‌లో న్యూ ఫీచర్.. ఇప్పటికి అక్కడ మాత్రమే..

Webdunia
శనివారం, 26 అక్టోబరు 2019 (11:24 IST)
సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన ఫేస్‌బుక్‌ల సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. అయితే, ప్రస్తుతానికి ఈ న్యూ ఫీచర్ భారత్‌లో అందుబాటులోకి రాలేదు. కేవలం అమెరికాలోని ఫేస్‌బుక్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. 
 
ప్రస్తుతం, పోస్టులకు సంబంధించి న్యూస్ ఫీడ్ ఫీచర్ ఉన్నా, తాజా వార్తలు, కథనాల కోసం ప్రత్యేకంగా న్యూస్ విభాగాన్ని ప్రారంభిస్తోంది. ప్రస్తుతానికి ఇది పైలెట్ ప్రాజెక్టుగా అమెరికాలో కొద్దిమంది యూజర్లకు అందుబాటులోకి తీసుకునిరానుంది. ఆపై మరింత మెరుగుపరిచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఫేస్‌బుక్ యాజమాన్యం ప్రకటించింది. 
 
మరోవైపు, స్థానిక మీడియా సంస్థల కథనాలు, పాత్రికేయులు ఎంపిక చేసిన కథనాలకు ఫేస్‌బుక్ న్యూస్ విభాగంలో చోటు కల్పిస్తారు. ప్రత్యేకమైన ఆల్గోరిథమ్ ద్వారా యూజర్ల అభిరుచులకు అనుగుణంగా వార్తలు కనిపించేలా ఈ న్యూస్ విభాగాన్ని తీర్చిదిద్దుతున్నారు. అంతేకాదు, పెయిడ్ న్యూస్ సబ్ స్క్రిప్షన్లను ప్రచారం చేసుకునే వారికి అనువుగా ఇందులోనే ప్రత్యేక విభాగం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కావ్యా మారన్‌ను అనిరుధ్ పెళ్లాడనున్నారా?

శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో 'ఈఠ' టైటిల్ వివాదం ఏంటి?

నా భర్త గోవిందాకు అనేక మంది మహిళలతో సంబంధం ఉంది : భార్య సునీత అహుజా

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 విడుదల తేదీ ఖరారు

తర్వాతి కథనం
Show comments