Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియా పరిశ్రమను ఆదుకునేందుకు ఫేస్‌బుక్ సిద్ధం

Webdunia
మంగళవారం, 31 మార్చి 2020 (14:25 IST)
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మీడియా కోసం సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. కరోనా వైరస్ కారణంగా నష్టపోయిన మీడియా పరిశ్రమను ఆదుకునేందుకు మరో 100 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. 
 
ఇందులో ఫేస్‌బుక్ జర్నలిజం ప్రాజెక్టు ద్వారా స్థానిక మీడియా సంస్థలకు అత్యవసర గ్రాంటు కింద 25 మిలియన్ డాలర్లు, మార్కెటింగ్ ద్వారా పబ్లిషర్లకు ఆదాయం కల్పించేలా మరో 75 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్టు ఫేస్‌బుక్ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా పబ్లిషర్లకు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం క్షీణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది.
 
ఇప్పటికే స్థానిక మీడియా సంస్థల కోసం ఒక మిలియన్ డాలర్లు, ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థలకు ఒక మిలియన్ డాలర్లు, అంతర్జాతీయ ఫ్యాక్ట్ చెకింగ్ నెట్‌వర్క్ కోసం 1 మిలియన్ డాలర్లు ప్రకటించామని ఫేస్‌బుక్ పేర్కొంది. తొలి విడతలో తాము ప్రకటించిన సాయాన్ని అమెరికా, కెనడాల్లోని 50 స్థానిక మీడియా సంస్థలకు అందించినట్టు తెలిపింది. 
 
కరోనా మహమ్మారిపై ప్రజలకు సమాచారం అందించేందుకు అత్యంత క్లిష్ట పరిస్థితుల మధ్య వార్తా పరిశ్రమ పనిచేస్తున్నదని ఈ సందర్భంగా ఫేస్‌బుక్ కొనియాడింది. కోవిడ్-19 కారణంగా ఆదాయం పడిపోవడంతో స్థానిక జర్నలిస్టులపై తీవ్ర ప్రభావం పడిందనీ.. మరోవైపు తమ కుటుంబాలు, బంధు మిత్రులకు సంబంధించిన కీలక సమాచారం కోసం ప్రజలు జర్నలిస్టులపైనే ఆధారపడుతున్నారని ఫేస్‌బుక్ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments