Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రయాన్-2 ఆర్బిటర్.. చందమామ ఉపరితలంపై నీటి జాడను గుర్తించిందా?

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (21:22 IST)
orbiter
చంద్రయాన్-2 విఫలమైన సంగతి తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ సాఫీగా దిగలేక చంద్రుడి ఉపరితలాన్ని బలంగా గుద్దుకుని నిలిచిపోయింది. అయితే, ఆశించిన లక్ష్యాన్ని నెరవేర్చడంలో విక్రమ్ ల్యాండర్ నిరాశపర్చినా, ఇప్పటికీ కక్ష్యలో పరిభ్రమిస్తూనే ఉన్న చంద్రయాన్-2 ఆర్బిటర్ అద్భుతమైన సమాచారాన్ని ఇస్రో శాస్త్రవేత్తలకు చేరవేసింది. చందమామ ఉపరితలంపై నీటి జాడను ఈ ఆర్బిటర్ గుర్తించింది.
 
చంద్రయాన్-2 ఆర్బిటర్‌లో 8 కీలక శాస్త్రసాంకేతిక పరిశోధన పరికరాలు ఉన్నాయి. వీటిసాయంతో జాబిల్లి ఉపరితలంపై హైడ్రాక్సిల్, నీటి అణువులను కనుగొంది. ఇమేజింగ్ ఇన్ ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ సాయంతో ఆర్బిటర్ ఈ సమాచారాన్ని సేకరించింది. భారత అంతరిక్ష పరిశోధకులు ఈ డేటాను విశ్లేషించి, చంద్రుడిపై ఖనిజ లవణాల సమ్మేళనాన్ని అవగాహన చేసుకునేందుకు ప్రయత్నించనున్నారు. 
 
ఆర్బిటర్ పంపిన ప్రాథమిక సమాచారం మేరకు చంద్రుడిపై విస్తృత స్థాయిలో తేమ ఉనికిని స్పష్టంగా వెల్లడిస్తోందని పరిశోధకులు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు ఇటీవల కరెంట్ సైన్స్ జర్నల్ లో ప్రచురితం అయ్యాయి. మరిన్ని అంతరిక్ష పరిశోధనలకు ఇది నాందిగా నిలుస్తుందని భారత పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments