Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైజూస్ యజమాని రవీంద్రన్‌పై కేసు.. ఎందుకంటే..?

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (16:47 IST)
Byjus
బైజూస్ యజమాని రవీంద్రన్‌పై కేసు నమోదు అయింది. యూపీఎస్సీ సిలబస్‌‌కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించారన్న ఆరోపణలతో ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. క్రిమోఫోబియా అనే సంస్థ చేసిన ఫిర్యాదు ఆధారంగా నేరపూరిత కుట్ర, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 (ఎ) కింద రవీంద్రన్ పై కేసు నమోదు చేశామని ముంబై పోలీసులు తెలిపారు. 
 
క్రిమియోఫోబియా వ్యవస్థాపకుడు స్నేహిల్ ధాల్.. యూపీఎస్‌సీకి సంబంధించి బైజూస్ తప్పుడు సమాచారాన్ని అందించిందని ఆరోపించారు. యుపీఎస్‌సీ ప్రిపరేటరీ మెటీరియల్‌లో సీబీఐని యుఎన్‌టీఓసీకి నోడల్ ఏజెన్సీగా చెప్పినట్లుగా వెల్లడించారు. 
 
ఈ విషయాన్నిగమనించిన వెంటనే కంపెనీకి అవసరమైన మార్పులు చేయమని కోరుతూ ఒక ఈ-మెయిల్ పంపినా.. బైజూస్‌ సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు వెల్లడించారు. 
 
ఈ విష‌య‌మై బైజూస్‌ రవీంద్రన్ స్పందిస్తూ.. ఎఫ్‌ఐఆర్‌ కాపీని తమ న్యాయవాదులు పరిశీలిస్తున్నారని తెలిపారు. భారత్ లో బాగా పాపులర్‌ ఎడ్యుకేషనల్‌ యాప్‌గా పేరొందిన బైజూస్‌.. తన సేవలను మరింతగా విస్తరించనుంది. ఇకపై అకడామిక్‌ ఓరియెంటెండ్‌ సర్వీసెస్‌ లను మాత్రమే కాకుండా.. రాబోయే రోజుల్లో ప్రొఫెషనల్‌, సర్టిఫికేట్‌ కోర్సులపై కూడా దృష్టి సారించనుంది. ప్రస్తుతం టీమిండియాకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments