Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్‌కు పోటీగా మైక్రోమ్యాక్స్: భారత్-1 పేరిట 4జీ ఫోన్

దేశ వ్యాప్తంగా రిలయన్స్ జియో విడుదల చేసిన 4జీ ఫీచర్ ఫోనుకు పోటీగా మైక్రోమ్యాక్స్ సంస్థ ''భారత్-1'' పేరిట 4జీ ఎల్టీఈ ఆధారిత ఫోన్‌ను విడుదల చేసింది. రిలయన్స్ జియో ఫోను కంటే కాస్త అధికంగా.. అంటే రూ.2,20

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2017 (13:24 IST)
దేశ వ్యాప్తంగా రిలయన్స్ జియో విడుదల చేసిన 4జీ ఫీచర్ ఫోనుకు పోటీగా మైక్రోమ్యాక్స్ సంస్థ ''భారత్-1'' పేరిట 4జీ ఎల్టీఈ ఆధారిత ఫోన్‌ను విడుదల చేసింది.  రిలయన్స్ జియో ఫోను కంటే కాస్త అధికంగా.. అంటే రూ.2,200 లకు లభిస్తుంది. రూ.2,200లకు లభించే ఈ ఫోనులోబీఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకుంటే, అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ యాక్సెస్, కాలింగ్, ఎస్ఎంఎస్, ఉచిత రోమింగ్ తదితరాలన్నీ నెలకు రూ. 97 రీచార్జ్‌తోనే లభిస్తాయి. 
 
వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. రిలయన్స్ జియో ఫీచర్ ఫోనుతో పోలిస్తే భారత్-1 చాలా చౌకగా వచ్చినట్టవుతుందని ఐటీ నిపుణులు అంటున్నారు. రెండేళ్ల పాటు జియో వాడితే.. రూ. 5,172 అవుతుందని, అదే మైక్రోమాక్స్ ఫోన్ భారత్-1 వాడితే రూ. 4,528 మాత్రమే అవుతుందని వారు చెప్తున్నారు. ఇక మూడేళ్ల కాలపరిమితికి పరిశీలిస్తే, జియో ఫోన్‌కు రూ. 6,008 వెచ్చించాల్సి రాగా, భారత్-1కు రూ. 5,692 మాత్రమే అవుతుందని మైక్రోమాక్స్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. 
 
భారత్-1 ఫోన్ ఫీచర్స్.. 
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 2015 ప్రాసెసర్, 
4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 
512 ఎంబీ రామ్ 
2.4 అంగుళాల స్క్రీన్, 
2ఎంపీ, వీజీఏ కెమెరాలు, 
భారత భాషలకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments