Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్.. రూ.147కి రీఛార్జ్ చేస్తే?

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (13:07 IST)
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రూ.147 ధరతో కొత్త ప్లాన్ అందిస్తోంది. రూ.147 ప్లాన్ రీఛార్జ్ చేసిన వారికి 250 నిమిషాల వరకు లోకల్, ఎస్‌టీడీ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్‌తో 10జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. వేలిడిటీ 30 రోజులు మాత్రమే. బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ కూడా లభిస్తాయి. 
 
కస్టమర్లు ఓ ఎస్ఎంఎస్ పంపి ఇండిపెండెన్స్ డే స్పెషల్ రూ.147 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. దీంతో పాటు రూ.247 ప్లాన్‌కు 6 రోజులు, రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్‌పై 74 రోజులు వేలిడిటీని పొడిగించింది బీఎస్ఎన్ఎల్. 
 
అలాగే రూ.247 ప్లాన్‌పై 36 రోజులు, రూ.1,999 ప్లాన్‌పై 439 రోజుల వేలిడిటీ పొందొచ్చు. ఈ ప్లాన్స్‌పై ఎరాస్ నౌ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. 30 రోజుల వరకు ఎరాస్ నౌ కంటెంట్ ఉచితంగా చూడొచ్చు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా బీఎస్ఎన్ఎల్ అందించే ఈ ప్రమోషనల్ ఆఫర్స్ అన్నీ ఆగస్ట్ 31 వరకేనని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments