Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు ప్రారంభం.. హై-స్పీడ్ ఇంటర్నెట్

సెల్వి
గురువారం, 8 ఆగస్టు 2024 (10:25 IST)
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 5జీ సేవలను ప్రారంభించనుంది. 5జీ నెట్‌వర్క్ ద్వారా హై-స్పీడ్ ఇంటర్నెట్, మెరుగైన కాలింగ్ ఫీచర్లను అందించాలని బీఎస్‌ఎన్‌ఎల్ యోచిస్తోంది. బీఎస్ఎన్ఎల్ 5జీని ఉపయోగించి ఇప్పటికే మొదటి కాల్ విజయవంతంగా చేశారు. 
 
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్‌ని ఉపయోగించి ప్రారంభ కాల్ చేశారు. ఆ వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొదటగా బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు దేశంలోని ప్రధాన నగరాల్లోని వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. 
 
బీఎస్‌ఎన్‌ఎల్ 5జీ సిమ్‌కార్డు అన్ బాక్సింగ్‌కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత నెలలో జియో, ఎయిర్‌టెల్, వీఐ మొదలైన టెలికాం ఆపరేటర్లు విపరీతంగా ఛార్జీలను పెంచాయి. ఈ నేపథ్యంలో 4జీ, 5జీ కనెక్టివిటీతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు బీఎస్ఎన్ఎల్ ప్రయత్నిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments