Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో దెబ్బ.. ఎయిర్ టెల్‌కు తలనొప్పి.. 54 శాతం లాభాలు క్షీణించాయ్

దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరుతో సంచలనం సృష్టించిన జియోతో ఎయిర్‌టెల్‌కు తలనొప్పి తప్పట్లేదు. దేశంలో అగ్రగామి టెలికాం సంస్థ అయిన ఎయిర్‌టెల్‌ ఆర్థిక ఫలితాలపై రిలయన్స్‌ జియో ప్రభావం విశేషంగా పడింది. డిసెం

Webdunia
బుధవారం, 25 జనవరి 2017 (10:00 IST)
దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరుతో సంచలనం సృష్టించిన జియోతో ఎయిర్‌టెల్‌కు తలనొప్పి తప్పట్లేదు. దేశంలో అగ్రగామి టెలికాం సంస్థ అయిన ఎయిర్‌టెల్‌ ఆర్థిక ఫలితాలపై రిలయన్స్‌ జియో ప్రభావం విశేషంగా పడింది. డిసెంబరు 31వ తేదీతో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్‌ లాభం 54 శాతం క్షీణించింది. కంపెనీ కన్సాలిడేటెడ్‌ లాభం గత ఏడాది క్యు3లో 1108.10 కోట్ల రూపాయల నుంచి ఈ త్రైమాసికంలో 503.70 కోట్లకు పడిపోయింది. ఇది నాలుగు సంవత్సరాల కనిష్ట స్థాయిగా నమోదైనట్లు ఎయిర్‌టెల్ అధికారులు తెలిపారు. 
  
కానీ ఆదాయాలపరంగా ఎయిర్‌టెల్‌ మార్కెట్‌ వాటా చారిత్రక గరిష్ఠ స్థాయి 33 శాతానికి చేరిందని, భారత రాబడులు 1.8 శాతం, ఆఫ్రికా ఆదాయాలు 6 శాతం పెరిగాయని ఎయిర్ టెల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక డిసెంబరు 31 నాటికి ఎయిర్‌టెల్‌ సమీకృత నికర రుణభారం 24 శాతం పెరిగి 97,365.20 కోట్ల రూపాయలకు చేరింది. గత ఏడాది ఇదే సమయంలో రుణభారం 78,451.50 కోట్ల రూపాయలుంది. మొత్తానికి జియో దెబ్బతో ఎయిర్ టెల్ కష్టాల్లో కూరుకుపోయిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments