Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేలానికి ప్రపంచంలోనే అతి భయంకరమైన ల్యాప్‌టాప్...

Webdunia
మంగళవారం, 28 మే 2019 (19:31 IST)
చారిత్రక ప్రాశస్త్యం కలిగిన, అరుదైన, అపురూపమైన వస్తువులు, పాతకాలం నాటి కళాఖండాలను వేలం వేయడం చాలానే చూసుంటాం. కానీ వీటన్నింటికి భిన్నంగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ల్యాప్‌టాప్‌గా పేరొందిన ఓ వస్తువు వేలానికి వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు, కంపెనీలకు 95 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని చేకూర్చిన ఆరు ప్రమాదకర వైరస్‌లు ఈ ల్యాప్‌టాప్‌లో ఉండటంతో దీనికి ఆ పేరువచ్చింది. నిర్వాహకులు దీన్ని వేలం వేయగా 1.3 మిలియన్‌ డాలర్లు పలికింది.
 
ఈ ల్యాప్‌టాప్‌లో ప్రపంచాన్ని గడగడలాడించిన ‘వాన్నాక్రై’, ‘ఐ లవ్‌ యూ’, ‘డార్క్‌ ఎనర్జీ’, ‘సో బిగ్‌’, ‘మైడూమ్‌’, ‘డార్క్‌టెక్విలా’ వైరస్‌లు, రాన్సమ్‌వేర్‌లు ఉన్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన వైరస్‌లతో కూడిన ల్యాప్‌టాప్‌ను గ్యూ ఓ డాంగ్‌ అనే ఇంటర్నెట్‌ ఆర్టిస్ట్‌ రూపొందించాడు. 
 
వైరస్‌లపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు ఇలాంటివి భౌతికంగా మనపై దాడి చేస్తాయని చెప్పడమే తన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ల్యాప్‌టాప్‌ నుంచి వైరస్‌ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకున్నామని దీన్ని కేవలం విద్యా ప్రయోజనాల కోసమే వినియోగించాలని నిర్వాహకులు తమ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments