Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాంసంగ్ ఫోన్ తయారీకి రూ.19,500 ఖర్చైతే.. అమ్మకపు ధర మాత్రం రూ.57,900?

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్‌ గురించి కొత్త రిపోర్ట్ విడుదలైంది. శాంసంగ్ నుంచి విడుదలై గెలాక్సీ ఎస్8 గురించి ఆసక్తికరమైన సమాచారం ఓ నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చింది. శాంసంగ్ స్మార్ట్ పోన్ గెలాక్

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2017 (14:55 IST)
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్‌ గురించి కొత్త రిపోర్ట్ విడుదలైంది. శాంసంగ్ నుంచి విడుదలై గెలాక్సీ ఎస్8 గురించి ఆసక్తికరమైన సమాచారం ఓ నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చింది. శాంసంగ్ స్మార్ట్ పోన్ గెలాక్సీ నోట్ 7ను తయారీ ఖర్చుతో పోలిస్తే రూ.26,700 అధికంగా అమ్ముతున్నారని తెలిసింది. ఈ ఫోన్ తయారీకి చాలా తక్కువగా ఖర్చైనట్లు నివేదికలోని వివరాల ద్వారా వెల్లడి అయ్యింది. 
 
ఈ క్రమంలో తాజా రిపోర్టు ప్రకారం ఎస్8 స్మార్ట్ ఫోన్ తయారీకి రూ. 19,500 కాగా, దీన్ని రూ. 57,900కు అమ్ముతున్నారని తేలింది. అంతేగాకుండా.. ఈ నివేదిక ప్రకారం, విడి భాగాలను అమర్చేందుకు అయిన ఖర్చు రూ.392 అని, గెలాక్సీ ఎస్7 కన్నా రూ. 2,800 ఎక్కువ ఖర్చు పెట్టారని, ఇదే సమయంలో ఎస్ 7 ఎడ్జ్‌తో పోలిస్తే రూ. 2,300 తక్కువని, బ్యాటరీ ధర కేవలం రూ. 291 మాత్రమేనని వెల్లడించింది. 
 
కానీ తయారీకి ఖర్చు తక్కువే అయినప్పటికీ.. అధికంగా అమ్ముతున్న మొత్తం ద్వారా పన్నులు, రీటైల్ మార్జిన్, పన్నులు వంటి వాటికి ఈ మొత్తాన్ని ఉపయోగిస్తారని.. ఇదంతా కంపెనీకి లాభంగా మిగులుతుందని చెప్పలేమని ఆ నివేదిక ద్వారా తేలింది.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments