Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో లాక్‌డౌన్ : కాలపరిమితిని పొడగించిన టెల్కో కంపెనీలు

Webdunia
ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (12:18 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. దీంతో మొబైల్ వినియోగదారులకు ఊరట కల్పించేలా నాలుగు టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు బీఎస్ఎన్ఎల్ కంపెనీలు మంచి నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 16వ తేదీతో వ్యాలిడిటీ ముగిసిన ప్రీపెయిడ్ నంబర్లన్నిటికీ మే మూడో తేదీ వరకు వ్యాలిడిటీని పొడగించింది. 
 
లాక్‌డౌన్‌ను దృష్టిలో ఉంచుకొని వారి ప్యాక్‌ల చెల్లుబాటు గడువు (వ్యాలిడిటీ పీరియడ్‌)ను పొడిగించాయి. లాక్‌డౌన్‌ ముగిసే వరకు తమ వినియోగదారులకు ఇన్‌కమింగ్‌ కాల్స్‌ను అందజేస్తామని రిలయన్స్‌ జియో ప్రకటించింది. దీనివల్ల కేవలం అల్పాదాయ వినియోగదారులకే కాకుండా ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్లాన్లను రీచార్జిచేసుకోలేకపోతున్న వారందరికీ లబ్ధి చేకూరుతుందని పేర్కొంది. 
 
ఇదేవిధంగా తమ నెట్‌వర్క్‌ల పరిధిలోని దాదాపు 12 కోట్ల మంది అల్పాదాయ వినియోగదారుల ప్రస్తుత ప్లాన్ల గడువును వచ్చేనెల 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ వెల్లడించాయి. మరోవైపు ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ ఎల్‌ తమ ఖాతాదారులకు మే 5 వరకు ఇన్‌కంమింగ్‌ కాల్స్‌ సౌకర్యాన్ని పొడిగిస్తున్నట్టు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ నటుడు షిహాన్ హుస్సేని మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments