Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో వెన్ను విరిచిన ట్రాయ్.. ఊపిరి పీల్చుకున్న వొడాఫోన్, ఎయిర్‌టెల్

Webdunia
సోమవారం, 4 నవంబరు 2019 (11:36 IST)
ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో.. ఆపై బంపర్ ఆఫర్లతో వినియోగదారుల సంఖ్యను అమాంతం పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలో టెలికాం రంగ సంస్థల భారీ నష్టాలను దృష్టిలో పెట్టుకుని, జియో వెన్ను విరిచింది. ఇందులో భాగంగా మొబైల్ రింగింగ్ టైమ్ 30 సెకన్లు మాత్రమే వుండాలని ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఇప్పటివరకు అన్నీ నెట్‌వర్క్ సంస్థలన్నీ అవుట్ గోయింగ్ కాల్స్‌కు రింగింగ్ సమయాన్ని 45 సెకన్లను వుంచాయి. అయితే ఇటీవల రిలయన్స్ జియో సంస్థ తన రింగింగ్ కాల్స్ సమయాన్ని ఉన్నట్టుండి 20 సెకన్లకు తగ్గించింది. దీన్ని ఎయిర్ టెల్ తీవ్రంగా ఖండించింది. 
 
అంతేగాకుండా ట్రాయ్‌కి ఫిర్యాదు చేసింది. ఫలితంగా ట్రాయ్ జియోకు షాక్ ఇచ్చింది. ఫలితంగా జియో రింగింగ్ టైమ్‌ను 20 సెకన్ల నుంచి 25 సెకన్లకు పెంచింది. ఈ క్రమంలో ఎయిర్ టెల్, వొడాఫోన్ వంటి టెలికాం సంస్థలు కూడా తమ రింగింగ్ సమయాన్ని తగ్గించాయి. 
 
ఈ నేపథ్యంలో ల్యాండ్ లైన్, సెల్ ఫోన్ సేవలకు సంబంధించి సవరణలపై ట్రాయ్ కన్నేసింది. ఇందులో భాగంగా సెల్ ఫోన్ల రింగింగ్ టైమ్ 30 సెకన్లకు, ల్యాండ్ లైన్లకు 60 సెకన్ల రింగింగ్ టైమ్ వుండాలని షరతు పెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కు మరింత వినోదం వుండేలా డిజైన్ చేస్తా : అనిల్ రావిపూడి

కెరీర్ లో యాక్షన్ టచ్ తో కామెడీ ఫిల్మ్ లైలా: విశ్వక్సేన్

తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటి అని అన్నయ్య అడిగారు? శ్రీసుధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments