Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెలికాం సంస్థలకు సుప్రీంలో షాక్.. బకాయిల చెల్లింపు విషయంలో సీరియస్

Webdunia
శనివారం, 15 ఫిబ్రవరి 2020 (12:55 IST)
అడ్జెస్టెడ్‌‌ గ్రాస్‌‌ రెవెన్యూ (ఏజీఆర్‌‌) బకాయిల చెల్లింపు విషయంలో టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. బకాయిలు కట్టనందుకు జడ్జీలు టెల్కోలపై, డాట్​పై మండిపడ్డారు. వీటిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని డాట్‌‌ ఆఫీసర్లను నిలదీశారు. దీంతో బకాయిలు వెంటనే కట్టాలని డాట్​ టెల్కోలను ఆదేశించింది. ఎయిర్‌‌టెల్‌‌, వొడాఫోన్‌‌ ఐడియాపై కోర్టను ధిక్కరించినట్టుగా కోర్టు తేల్చింది. 
 
తదుపరి విచారణ జరిగే మార్చి 17న టెల్కోల, డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ టెలికం (డాట్‌‌) ఎండీ, టాప్‌‌ అఫీషియల్స్‌‌ స్వయంగా రావాలని ఆదేశించింది. టెల్కోలు ఈ ఏడాది జనవరి 23 నాటికి రూ.లక్ష కోట్లకుపైగా ఏజీఆర్‌‌ బకాయిలు చెల్లించాలంటూ తాము ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయలేదంటూ డాట్‌‌ను కోర్టు మందలించింది. 
 
ఇది వరకే వేల కోట్ల రూపాయల అప్పులతో సతమతమవుతున్న టెల్కోలకు సుప్రీంకోర్టు తీర్పు తీవ్ర ఇబ్బందికరమేనని టెలికాం ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు. ఏజీఆర్‌‌ బకాయిలు చెల్లించకపోతే వొడాఫోన్‌‌ ఐడియా మూతపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments